Thursday, 24 September 2015

పెళ్లి బంధాలు - బాందవ్యాలు

పెళ్లి అంటే బంధాలు - బాందవ్యాలు కాకుండా కోర్టులు కేసులు అయ్యాయి

పెళ్లి అంటే ఆర్థిక లావాదేవీల వ్యాపార విషయం అయ్యింది
పెళ్ళికి చేసిన అప్పులు తీరకముందే 498 లు 126 ల కేసులు పడుతున్నాయి !!

పిల్లనివ్వడానికి డబ్బుఇవ్వాలి(కట్నం) ... పిల్ల కావాలంటే ఆస్తులు (సంపాదన - గృహం..  పేరుమీద ఉన్న భూములు వగైరా!!) చూపాలి !!

తాళి కట్టేటప్పుడు అబ్బాయి "అర్తేచ ధర్మేచ కామేచ మొక్షేచ " నాతిచరామి అని ప్రమాణాలు చేయాలి
కాని ఒక్క పెళ్లి  కూతురైనా  "నకిలీ 498 పెట్టను" "నకిలీ కేసులతో భర్త వైపు కుటుంబస్తులని  వేదించను" అని ప్రమాణం చేస్తుందా!!?

తాళి కట్టిన మరుక్షణం మగాడి ఆస్థిలో సగ భాగానికి అధికారి హక్కుదారు అవుతున్న అమ్మాయి పెళ్ళికి ముందు కట్నం కడితే తప్పేంటి అంటున్న వారికి సమాధానం నాకు దొరకటంలేదు!
పెళ్లి .. భార్య అంటే ... పాత సినిమాలూ ..  సావిత్రి/కృష్ణ కుమారి లా అనుకునే అమాయకులకి షీనా బోరా లాంటి మహిళా మణుల ని చూసి దడ వేస్తోంది :) !! నకిలీ వేదింపు కేసుల బాదితలని వారి గురించి వార్తల్లో చుస్తే పెళ్లి అంటె భయం వేస్తోంది!! 

బహుశా ఇటలీ బార్ డ్యాన్సర్ ఆలోచన ఇదే కావచ్చు ! అందుకే చట్టాన్ని...  పోలీసులని..  కొర్టులని ... కుటుంబం లోని పడక గది దాకా తీసుకొచ్చింది ఈ "గృహ హింస చట్టం" తో !!

మెల్లిగా సహజీవనాలు పెరిగి పెళ్లి అనే సనాతన ధర్మ ప్రవాహం ఆగి పోయి సమాజం కుప్పకూలే అవకాశం ఉంది .. ఐరోపా సమాజం లాగా తండ్రి ఎవడో తెలియని పిల్లల సంఖ్యా పెరిగి నైతిక విలువలు నశించి ఈ దేశం బ్రష్టు పట్టె అవకాశం ఉంది!
కానీ కొరికలతో ఆశలతో నిండిన భక్తులు ప్రతి పర్వదినం నాడు గుడుల చుట్టు తిరగడం చూస్తే ఒక చిన్న నమ్మకం ఈ సమాజం ఇప్పట్లో  నాశనం అవదు ... ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుంది అనిపిస్తుంది. 
ఇప్పటికీ ఎప్పటికీ వరకట్నానికి నేను వ్యతిరేకినే. 

రైతులు - విద్యార్థులు వారి ఆత్మ హత్యలు

 రైతులు వారి ఆత్మ హత్యల వెనక ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా ఉంది!
కానీ సామాజిక రుగ్మతులు ఎక్కువ కారణమ్. ఎందుకంటే ప్రతి సచ్చిన రైతు కథలో ఒక "భారీ ఖర్చు"  ఉంది ఆ ఖర్చు పెళ్లి కావచ్చు కుటుంబం లో "పద్దతి" అని చచ్చు పద్దతుల వాళ్ళ ఏర్పడ్డ ఖర్చు కావచ్చు!!
1000 యేళ్ళ  బానిసత్వం లో జనాలు ఒక కుటుంబానికి మరో కుటుంబం చెదోడు వాదోడు గా ఉండాలని ఏర్పర్చుకున్న కొన్ని పాటింపులు, పద్ధతులు అతి మించి నేడు సామాజిక రుగ్మతులు అయ్యాయి!!

అధికారులు .. పాలకుల నుండి సరి అయిన సహకారం అందకా....  సామాజికంగా నిలబడడానికి కుటుంబాల మధ్య ఆర్ధిక  సంబంధాలు ఏర్పడ్డాయి. అతి "సర్వత్రా వర్జయేత్" అన్న మాట అర్థం చేసుకోక కుటుంబాల మధ్య సంబంధాల కన్నా ఆర్ధిక లావా దేవీలు ఎక్కువ అయ్యాయి

ఈ ఆర్ధిక లావాదేవీలని సరిగ్గా నెరవేర్చే క్రమం లో శక్తికి మించి ఖర్చు లు చేసి భూమి నుండీ అధిక రాబడిని కోరుకుని అది రాకపోయే సరికి ఆత్మహత్యల పాలు అవుతున్నారు.
చేతకాని ప్రభుత్వాలు (కేంద్ర - రాష్ట్ర ) ఈ ఆత్మహత్య లకి కారణం ఈ రాజకీయ నాయకులే హంతకులు ఎందుకంటే రైతులకి సరైన చేదోడు  ఇవ్వక సమాజం లో పేరుకుపోయిన దురాచారాలని (కట్నం... అతి వడ్డీ వ్యాపారం.. లాంటివి) తొలగించక, బాధ్యలు సరిగ్గా నిర్వహించక సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారు!
కేంద్ర ప్రభుత్వం "జీరో బ్యాంకు అకౌంటులు " మొదలు పెట్టి ఒక మంచి పని చేసింది చాలా మంది గ్రామాలల్లో బ్యాంకు అకౌంటు అంటె తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు మన సొమ్ము దాచడానికి బ్యాకు వానికి 1000 రూపాయలు ఇచ్చి అకౌంటు ఎందుకు తీయాలి మాన ఊరిలో "పెద్ద కులస్తునికో , తన కులం లో  కాస్త ధనికుని వద్ధనో " దాచటం గానీ చిట్టీ వేయడం గాని చేస్తే సరిపోయే ... అనే దురభిప్రాయం ఉండి .. తమ కష్టార్జితాన్ని అలా కోల్పోతున్నారు!!
ఎన్నో మైక్రో ఫైనాన్స్ కంపనీలు .. చిట్టీ ల కంపనీలు సరైన  గుర్తింపు / రిజిస్ట్రేషను లేక బోర్డు తిప్పినప్పుడు ఎంతమంది నష్టపోయారు ... ఈ సున్నా అకౌంటు బ్యాంకు ఖాతాలలో లావాదేవీలు చేస్తే వారి ఖష్టార్జితానికి ఒక రక్షణ ఉంటుంది కదా.

ఈ చావులు చూసి మిడి మిడి జ్ఞ్యానం తో ముఖపుస్తకం లో "చెప్పులు ఎ.సీ రూముల్లో 100లు 1000లో  కూరగాయలు ఫుట్పాథ్ పై  10లు  ... 20 లకి అమ్మితే రైతులకి న్యాయం  రాదు  " అని ఎగురుతున్నారు!
అసలు చెప్పులు కొంటె ఎవరైనా 5 ... 6... 9.... 12.. నెలలు వాడుతారు అలాంటి వాటికి  150 ... 200 ... 300... 
అదే కూరగాయలు రోజు కొనాలి పేద వానికి కోడా అందుబాటులో ఉండాలి అంటె కూరగాయల ధర అందరికి అందుబాటులో ఉండాలి లేకుంటే కూరగాయలని ఎ. సి రూముల్లో కొనగలిగే వాడె బతుకుతాడు మిగతా పేద వాడు సావాల్సిందే!!

ఈ చచ్చు పుచ్చు ఆలోచనలు భట్టీ రాయులూ బాబులు అవినీతి చేసి ఫీజులు కట్టె కార్పొరేటు కాలేజీ  ల్లో  చదివిన వారికీ .... తెలివి బుర్ర లో  కాకుండా అరికాలు లో  ఉండే లేత కమ్యునిస్టులకి వస్తాయి  

ఒక రైతు ఆత్మా హత్య --- ప్రభుత్వ హత్య వెనుక కేవలం వ్యవసాయ ఇబ్బందులే కాకుండా ఎన్నో సామాజిక అంశాలు ఉంటాయి. వాటిని రూపు మాపడమ్ దార్శనికత గల వారి నై"పుణ్యం " కానీ నీటి రాజకీయ నాయకులలో పుణ్యాత్ములు ... నైపుణ్యం కలవారు చాలా అరుదు.
విద్యార్థుల ఆత్మా హత్యలు కూడా కేవలం కాలేజీలో జరిగే విషయాల వళ్ళ కాకుండా ఆయా జనాల "మొరాలిటీ " "నైతిక" విలువలు లోపించటం వాళ్ళ కూడా జరుగుతాయి.
విద్యార్థుల ... రైతుల ఆత్మా హత్యలు ఒక "ట్రెండు"  (Trend )ని ఫాలో అయినట్లుగా ఉంటాయి ... ఒక సంఘటన జరిగితే అది

మరెంతో  మందికి ఆదర్శం అయ్యి ఆత్మా హత్యల సంఖ్యా పెరుగుతోంది! దీని పాపం మీడియాది ... ఒక ఆత్మా హత్య ఎలా జరిగింది అని ట్యూషన్ చెప్పినట్లుగా వారి కవరేజి ఉంటోంది!!

ఆడావారి పై జరిగే ఆకృత్యాలు కూడా మనుషుల్లో లోపించిన నైతిక విలువల వళ్ళ జరిగేవే ... మొన్న సూది గాడి విషయం చూస్తే వాడు ఒక్కడు కాదు .... మీడియా ఇచ్చిన కవరేజి వళ్ళ వివిధ ప్రాంతాల్లో అలాంటి వారు తయారయ్యి సూది పోట్లు పొడిచారు ... ఒక్కడు దొరికాడు ... సీ.సీ.టీ.వీ ఫుటేజ్ వాళ్ళ దొరికాడు అనగానే అలాంటి సంఘటనలు ఆగి పోయాయి కానీ ఆ ట్రెండ్ మాత్రం అలా  సెట్ అయింది ఆ ఆలోచన జనాల కి తెలిసిపోయింది!!

ఈ దరిద్రాలు అన్ని ఆగాలంటే జనం లో "భక్తీ ఉద్యమం" రావాలి ... భక్తి  పెరిగి ... దేవుడు చూస్తున్నాడు అని ప్రతి ఒక్కరు నమ్మితే అందరు మంచి గా ఉండాలి చెడు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకుతారు ... లేకుంటే స్వేచ్చ ... అని దేవుడు లేడు  అని రేషనల్ గా వాగి మనల్ని ఎవ్వడు ఎం చయడు అనుకుంటే సమాజం  లో ఇలాంటి ఆకృత్యాలు పెరిగి సమాజం నాశనం అవుతుంది .

భారతీయ సమాజానికి భక్తీ ఉద్యమం కొత్త గాదు కానీ ఈ కమ్యునిస్టు చేద పురుగులు హేతువాద పిశాచాలు ఉన్నంత కాలం "మనల్ని ఎవడేం  చేయడు " సాక్ష్యం ఉండకుంటే చాలు మనం ఏదైనా చేయ వచ్చు !! అనే దరిద్రపు ధైర్యం పెరిగి భయ భక్తులు లేక/ రాక  సమాజం లో ఆకృత్యాలు పెరుగుతాయి.

ఇప్పటికే చాలా భక్తి   నిండిపోయింది ... అందుకే ఏ  చిన్న పండగ కైనా గుళ్ళూ గోపురాలు జనం తో నిండి పోతున్నాయి !!

అమ్మవారికి అష్టోత్తరం చదివి . .... విగ్రహాన్ని చేతులారా అలంకరించే వాడు  స్త్రీల పై ఆకృత్యాలు చేయడు  ... రుక్మిణి కల్యాణం చదివిన ఏ  ఆడదీ నలుగురి ని మెయింటైన్ చేయదు అలాంటప్పుడు రేపులు .. ఆసిడ్ దాడులు ఇంత  దారుణంగా ఉండవు. (ఒక వేల  ఉన్నా వారి సంఖ్యా చాలా అల్పం  దాన్ని కంట్రొల్ చేయడం తేలిక )













గ్రామాల దత్తత - శ్రీమంతుడు

గ్రామాల దత్తత అనేది మూర్ఖమైన ఆలోచన  పనిదొంగ వెధవలు బాధ్యలనుంచి  తప్పించుకోవటానికి మొదలు పెట్టిన ఆలోచన ఇది.

ప్రజలు పన్నుల రూపం లో చెల్లించిన డబ్బు కొట్టేసి దానికి లెక్కలు చూపక  పోగా .... మళ్ళీ  ప్రజల నుండి  దొంగదారిలో డబ్బు వసూలు చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు!!

ఏ సెలబ్రిటీ .... డబ్బుని అచ్చు వేయడు,  తీసే సినిమాని డబ్బుతోనే  తీసి లాభాలు చూసుకుంటారు గాని ఆకాశం నుండి  డబ్బుని కురిపించరు ఆ విధంగా జనం డబ్బుని సినిమా .... వ్యాపార .... క్రీడా కారుల మాధ్యమంగా వసూలు చేస్తున్నరు.

అసలు రాష్ట్ర బడ్జెట్ కోసం  వసూలు చేసే పన్నులు ఎవరి బొడ్లో తోస్తున్నరు? బడ్జెట్ లో  ప్రకటించిన పథకాలు వాటి ఖర్చుల కి కేటాయించిన డబ్బు ఎక్కడికి పోతుంది ?

60 ఏ ళ్ళుగా  తరతరాలు కూచుని మింగిన కాంగిరేసు ని ఏమీ  అనకూడదు మళ్ళీ జనమే డబ్బులు కూడబెట్టుకుని కొత్తగా ప్రాథమిక సౌకర్యాలని సమకూర్చుకోవాలి!!

రంకు మొగున్ని (కాంగిరేసు ని )కాపాడుకోవడానికి బాగా వచ్చింది ఆలోచన ఈ తోక పార్టీకి !!

మోదీ  గారు "సన్సద్ గ్రామీణ యోజన" మొదలుపెట్టింది పర్సు లోంచి తీసిన డబ్బు తో అభివృద్ధి చేయమని గాదు ... సెలబ్రిటీల డబ్బు తో కాదు ...
రాజ్య సభ, లోకసభ  సభ్యుల పేరిట ప్రతి టర్మ్ కి 50 కొట్లు కేటాయించ బడుతాయి వాటిని అంతకు ముందు సభ్యులు సద్వినియోగం చేసుకోలేదు కనుక ఒక్కొక్కరూ ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఆ 50 కొట్ల ని ఖర్చు చేస్తే ఆ గ్రామం బాగు పడుతుంది అలా 545 మంది 545 గ్రామాలని  బాగుచేయవచ్చు అని "దత్తత" అనే దానిని సూచించారు. అంటే  నిబద్దత కాన్సంట్రేషన్ ఒకే గ్రామం పై కేంద్రీకరించి పని చేయటం

దాన్ని ఎవరో ఒక వ్యక్తి  తన వ్యాపార లాభం కోసం సినిమాగా తీస్తే ఓ ఎగేసుకుని గ్రామాలని దత్తత ఇచ్చేస్తున్న చేతగాని ప్రభుత్వాన్ని చుస్తే చిరాకు వేస్తుంది!
ప్రభుత్వం ఏం  చేస్తుంది ... గ్రామా లు అన్నింటిని దత్తత ఇచ్చాక? ఫాం హౌస్ లో లిక్కర్ కొట్టి చుక్కలు లెక్క పెడ్తదా ?

అసలు కొరటాల శివ గారు మిడి మిడి జ్ఞ్యానం తో "సన్సద్ గ్రామీణ యోజన " అనే విషయాన్ని అపార్థం చేసుకున్నాడని తెలిసిపోతుంది . సరే "సినిమాకి కాదేది అనర్హం" అని వదిలేయక ఇదే అదను అని దత్తత ల కొనసాగింపు ఎంత తిక్క మాలిన పని??!!

ఈ రోజు ఒక మంచి వాడు దత్తత తీసుకుంటే పర్వాలేదు ... కాని ఒక వ్యాపార దృష్టి కలవాడు 4 గ్రామాలని దత్తత తీసుకుని వాటి పై అనధికార పెత్తనం చెలాయిస్తే ఎవడు దిక్కు?

ఇప్పటికే కాస్త ఆర్ధిక బలం ఉన్న వాళ్ళూ వారి ప్రాంతం లో అతి పెత్తనం చెలాయించటం  సర్వ సాధారణం అటువంటిది ఇక దత్త్తత తీసుకున్న తర్వాత రియల్ ఎస్టేటు కంట్రొల్ చేస్తూ అక్కడి ప్రజల సౌకర్యాలని నియంత్రిస్తూ పొతే జనానికి దిక్కెవరు... బానిసత్వానికి ప్రభుత్వం కారణం కాదా?  అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అర్హత .... ఆస్కారం ఉంటుందా ??

 అసలే ఈ దిక్కుమాలిన ప్రజాస్వామ్యంలో ప్రతి వెధవకీ దిక్కుమాలిన అవకాశాలు, స్వేచ్చ ఏడ్చి చచ్చాయి  ఇక కాస్త పెట్టుబడి పెట్టాక వాడి స్వేచ్చ ని ...  నియంత్రించడం ఎవరి తరం?

అసలే మధ్యతరగతి కుటుంబాలు ఒక్కడు పని చేస్తే 4 బతికే సోమరితనం తో కొట్టు  మిట్టాడుతున్నరు ఇలాంటి సమాజం లో  ఒక సెలబ్రిటీ తన సొంత డబ్బు తో పని చేసి పెడతాడు అంటే  సోమరి పనిదొంగ లు పని చేయడం మానేసి  చెడి పొయే  అవకాశం ఉంది .
 గవర్నమెంటు పనిమంతులలొ పనిచేసే వారి సంఖ్య చాల తక్కువ ఇక ఇలా సెలబ్రిటీలు బాధ్యత తీసుకుంటే వారికి ఇక పనేమీ? అవినీతికి అంతేమి?

రామ్ గోపాల్ వర్మ గారు ... తేజ గారు అన్నట్లు పన్నుల కోసం  దత్తతలు అంటె ఇక చార్టెడ్ అకౌంటు వారి తెలివి కి అంతుండదు!!
ఒక దత్తత తీసుకున్న వ్యక్తి 15 లక్షల పని చేసి 25 లక్ష ల  లెక్క చూపి పన్ను బ్యాలన్స్ చేస్తే ఆ 15 లక్షల పని నాసిరకం అయి కొన్నాళ్ళకి  మట్టీ పాలు అయి కొందరి ఊరి జనం ప్రాణాల మీదికి ఇక్కట్లు తెస్తే ప్రభుత్వం ఎం చేస్తుంది?

కట్టిన పన్నుల నుండి నిజాయితీగా ప్రభుత్వం పని చేస్తే ఇలా దత్తత ల తో  పబ్బం  గడపాల్సిన దారిద్ర్యం నా సమాజానికి ఎందుకు?


 అప్పుడెప్పుడో దూరదర్సన్ తెలుగు (సప్తగిరి ) చానల్ లో ఒక సీరియల్/ 2 ఎపిసోడ్ల టెలి ఫిలిం  చూసిన గుర్తు ఒక నగర శివారు ప్రాంతం లో  ఒక సంపన్నుడు ఇల్లు కట్టుకుంటాడు అప్పటికి ఆ ప్రాంతం లో ఉన్న పేద మధ్యతరగతి జనులకి కుళాయి నీళ్ళు ... కరెంటు సౌకర్యాలు ఉండవు  ఆ చుట్టుపక్కల వాళ్ళ ని ఎగదోసి అధికారుల చుట్టు తిప్పించి ఆర్జీలు పెట్టించి వాడే  అన్నీ ముందుండి నడిపించినట్లు అతి చేసి  ఆ శివారు ప్రాంతానికి నీళ్ళు కరెంటు వచ్చేలా చేస్తాడు ఆఖరుకి ఆ కాలనీ లో ఉండె వారికి ఎండాకాలం లో  నీళ్ళు ఇవ్వడానికి నానా ఇక్కట్లు పెడతాడు వాడి ఇంటికి లావుపాటి పైపు లైను మిగతా కాలనీకి మోస్తారు పైపులైను  ... అందరికి ఒక కరెంటు లైను వాడి ఇంటికి ప్రత్యేకమైన కరెంటు లైను ఇలా పని కానిచ్చి బయటికి మాత్రం వాడు ఆ ప్రాంత అభివృద్దికి మూల పురుషుడని మోలశంఖ పురుషుడు అని బిల్డప్పు ఇస్తాడు .
\
అసలు వాడు ఒక్కడికే లైను అడగబొతె వాడి స్నేహితుడో . ... పెళ్ళామో ఒక ఆలోచన ఇస్తారు .. నువ్వొక్కడివే  ఆర్జీ ఇస్తే ఖర్చు మొత్తం ఒక్కడివే భరించాల్సోస్తుంది ... పైగా ఆలస్యం అవుతుంది అదే జనం పని అంటే  ఖర్చు తగ్గుతుంది త్వరగా పని జరుగుతుంది అని అ!!
సీరియల్ ఆఖరులో వాడు పెద్ద మనిషిగానే చాలా మణీ  అవుతుంటాడు జనం వాణ్ని పై లెవెల్లో చూస్తుంటారు కాని రచయితా/ దర్శకుడూ లొగుట్టుని మనకి తెలిసేలా చూపెడతారు ....

ఇప్పుడు చచ్చు పుచ్చు ప్రభుత్వం తెచ్చిన దత్తత ఆలోచన ఇలాంటి దారునాలకి స్థానిక పెత్తన వికేంద్రీకరణ దారితీయటం చాలా సులభం !!

ఎంతైనా మన భారతీయులు ఎ మంచి పనినైనా అతి దారుణంగా దుర్వినియోగ పరచటం లొఅ ఉద్దండులు కదా !!




Wednesday, 16 September 2015

పనికిమాలిన టపా

కలలో కూడా కక్కుర్తిగా ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకురా!?
ఇష్టం వచ్చినంత మందిని కన్నట్లు గా కల గనవచ్చుగదా. ...కలగనడానికి  నొప్పులా అప్పులా!?!
కళ్ళు మూసుకుంటె చాలు గదా!!

Satire after watching Mallishwari (new) first song janma janmaladee kalatika song