Wednesday, 11 December 2013

PM Post!

Invited resumes for the Post of Prime minister of India ….. 
-by,
Sonia GaanDi Congress Inc .

Role Description:
Must be silent always, should control himself in meetings with journalists (however the media persons are our company agents).
Always ready to cover Shehazade from his silly mistakes!
Be Obedient to the Khandaan and make people fool by acting as Intelligent
Must act as Strong person, but never be so in company meetings.

Eligibility Criteria:
Strong expertise in being calm!
Expert in Saying “Ji Madam ji and Madam ji se baath karoongaa”!
Strong expertise in claiming credits of other’s work/ good Plans.

Note: Candidates are advised to refer MM-Singh publications to prepare.

Perks and Profits:
Enjoy the Foreign trips,
Will get Bharatha Ratna (only after shehazade get it),
No need to participate in any direct elections.

Tuesday, 26 November 2013

స్పెషల్ అగ్రికల్చరల్ జోన్

స్పెషల్ ఎకనామిక్ జోన్ లా ....... స్పెషల్ అగ్రికల్చరల్ జోన్  కేటాయించరు ఎందుకని?
భవిష్యత్తు లో అంతా  రియల్ ఎస్టేట్ చేసుకుని నోట్లు ఉడికించుకు తింటారా?  అసలు హైదరాబాద్ శివారు లో రంగా రెడ్డి జిల్లలో ఎన్ని ప్రాంతాల్లో పంట భూములు రియల్ ఎస్టేట్ భూదందాలో కనుమరుగు అయ్యాయి? ఎంతమంది లోకల్ చోటా రాజకీయనాయకులు వారి పబ్బం గడవడానికి ఎంత పంట భూమిని స్వాహా చేసారు?

ఇలా రోజు రోజుకీ కనుమరుగు అవుతున్న పంట భూమిని కాపాడే భాద్యత ఎవరికీ లేకుంటే, వచ్చే తరాలు తిండి కోసం - పంట కోసం ఎంత దూరం వెళ్ళాలి?
ఎన్నికల ముందు ఒకప్పుడు జనాలు వసతులు అడిగే వారు కానీ నేడు జనం ఎవ్వరి స్వార్థం వాళ్ళు చూసుకుని వోటుకెంత ఇస్తారు అని చూసుకుంటున్నారు నాశనమౌతున్న నేటి ని చూస్తూ భయంకరమైన రేపటిని ఊహించుకోవటం కష్టం!!.
అసలు ఎవరైనా నాయకుడు భవిష్యత్తు గురించి ఆలోచనలు చెస్తున్నడా .... అంతా  ఇప్పుడు పబ్బం ఎలా గడవాలి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే చూసుకుంటున్నారు.
జనం కూడా అలవాటుపడిపొయారు పాలన అంటే ఏంటో మర్చిపోయారు 10  ఏళ్లల్లో మారిన మనిషి తీరు అసహ్యాన్ని  కలిగించక మానదు.
ప్రతి జిల్లకీ కొంత ప్రాంతాన్ని వ్యవసాయ ప్రాంతం గా ప్రకటించి అక్కడ వ్యవసాయ క్షేత్రాలను - వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, అక్కడ రైతుల వద్ద నుండి భూమిని లాక్కొకూడదు.... SEZ  ల పేరిట, కంపనీ ల పేరిట భూమిని గుంజుకొకుండా జాగ్రత్త పడాలి, లేకుంటె పంటలు పండించడానికి భూమి లేకుండా పోతుంది.



Saturday, 2 November 2013

గుడులు - భక్తులు

ఇంతకీ  గుడిలళ్ళొ  భక్తులు  ఎక్కువగా ఉన్నారు అంటే  దానర్థం  ఏమిటి
 కోరికలు ఎక్కువ అయ్యుండాలి లేదా లేదా  కష్టాలు ఎక్కువ అయ్యుండాలి ...
గళ్ళా  నిండగానే దిగిపడి  దులుపుకెళ్ళే ప్రభుత్వ ప్రతి"నిధులు"  ...  ఈ కష్టాలు  పెరగాలనే కోరుకుంటారు కానీ   తగ్గాలని అనుకోరు కదా!!.

 

మొలతాడు

ప్రైస్ ట్యాగ్ అనే కాన్సెప్ట్  మన దేశం లోదే అనుకుంటా మొలతాడు కట్టి మగాడి    ధర నిర్ధారిస్తారు.
మొలతాడు కడితే చాలు సరుకుకి  ధర వచ్చేస్తుంది !!!.


Friday, 16 August 2013

చిన్న డయిలాగు :)

నేను తీసుకోవడం అక్షయ పాత్రను
ఇవ్వడం  లో  శెట్టి  గారి  తక్కెడను!

తీసుకునేటప్పుడు ఎంతైనా తీసుకుంటా .... కానీ ఇచ్చేటప్పుడు ఆచి తూచి ఇస్తా...... హ హ హ ! :)

Tuesday, 13 August 2013

స్వామి వివేకానందుల వారి వ్యాసాలు

నేను చదివిన ఒక పుస్తకం లోని కొన్ని పేజీలను ఇక్కడ పంచుకుందామని ఈ పిక్స్ ని పోస్ట్ చేస్తున్నాను ........ ఈ పుస్తకం లో ఉన్నవి 91 పేజీలే అయినా పూర్తిగా చదివాక నాకున్న కొన్ని అభిప్రాయాలు సమూలంగా మారాయి మీకో ఇలాంటి అనుభవమే అవుతుంది అని అనుకుంటున్నా .... ఈ పుస్తకం లోని వ్యాసాలూ అన్ని స్వామి వివేకానంద గారు వివిధ సందర్భాలలో ఇతరులకు రాసిన ఉత్తరాలు - ప్రత్యుత్తరాలు.



















నేడు మన భారత దేశం లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ చేస్తున్న సేవలు శ్లాఘనీయం అమోఘం ఉత్తరాన్ఖండ్ వరద బాదితులకి స్వయం సేవకులు చేసిన సహాయచర్యలు న్యూస్ చానెళ్ళు   చూపెట్టినా చోపెట్టక పోయినా సహాయం పొందిన వారికి మాత్రం బాగా గుర్తుండి  పోతుంది. వారు ప్రకృతి విపత్తులలోనే  కాకుండా వనవాసీ సేవ అని అడవిబిడ్డ లకి అక్షర జ్ఞానాన్ని అందిచే సేవలెన్నో  చేస్తున్నారు. ఈ సంఘానికి మూలం ఈ వ్యాసం లో వివేకానందుల వారు చెప్పిన వాఖ్యలే అనుకుంటా!.


Friday, 19 July 2013

ఎన్నికల పరీక్ష

ఊరికె తమాషాకి.... 
ఎలెక్షన్ కమిషన్ ఒక రూల్ తెచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఒక ఎక్సాం రాయాలి అంటే మన రాష్ట్రం లొని పార్టీలు వాటి అభ్యర్ర్థుల తీరు ఊహించి....
టి.డి.పి... : భార్య నామినేషన్ వెస్స్స్తుంది భర్త ఎక్సాం రాస్తాడు.(అన్న ఎంటీ ఆర్ పార్టీ పెట్టాక అన్న కంటే ఎక్కువ పాలించిన ఘనత అల్లుడిది కనుక!).

ప్రా రా.పా: ఎక్సాం పేపెర్ ఇచ్చాక సేఫ్టీ కోసం కాంగ్రేస్ పక్కన కూచుంటాడు. 

సి.పి.ఎం / సి.పి.ఐ: వీళ్ళు ఒక్క పేపెర్ లోనే ఎక్సాం రాస్తాము అని ఒకరు ముందునుంచి ... మరొకరు వెనకనుంచి మొదలెట్టి మధ్యలోకొచ్చాక లాక్కునీ పీక్కునీ సమయం అయిపోగొడతారు. (పేపర్ చినిగే అవకాశాలు ఎక్కువ!).

ఎం.ఐ.ఎం: ఒకటే పేపార్ లొ రాస్తారు రాసిన పేపర్ వాళ్ళే తీసుకుపోతారు ఎవ్వరూ ఎమని అడగారు... ఇన్విసిలేటార్ ఎంటని అడ్దిగితే బుర్ర పగలగొడతా అంటారు(గుర్తుందా y.s.R హాయాం లో హెల్మెT తప్పనిసరి అని రూల్ చేస్తే అక్బరుద్దీన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు "ఎవడన్నా హెల్మెత్ అడిగితే తల పగలకొట్టండీ నే చూస్కుంటా అని... దన్న్ని బట్టీ.").

భా.జా.పా: పపం వీళ్ళు అడిష్నల్ మీద అడ్దిష్నల్లు తీసుకుని బాగానే సబ్జెక్ట్ రాస్తారు కానీ జె.ఎన్.టి.యు పేపర్ లాగా స్పెక్ట్రాం కంటెంట్ ఉండదు అంతా టెక్స్ట్బుక్ నాలెడ్జ్ రాసి మార్కులు పోగొట్టుకుంటారు.

ఖాంగ్రెస్స్(నా ఫవరెట్): వీళ్ళు పేపర్ ని కిటికీ లోంచి బయటికి పంపి వెరే వారితో(ముఖ్యంగా భా.జా.పా వారితో ) రాయించి ఆ రాయించిన దాన్ని మార్చి ఇన్విసిలేటర్ కి ఇచ్చెముందు ఒక సాఅరి అమ్మకి (మేడం కి ) చూపిచ్చి సబ్మిట్ చేస్తారు.

టీ.ఆర్.ఎస్: వీళ్ళు ఎక్సాం రాయటానికి ఒక జే ఏ. సీ పెడతారు అందులో మళ్ళీ కార్మిక... జే.ఏ.సి, సింగరేణి జే.ఏ.సి....ఆర్.టీ.సి జే.ఏ.సి... ఉద్యోగ సంఘాల జే.ఏ.సీ. విద్యార్తి సాంఘాల జే.ఏసీ... రాజకీయ జే.ఏ.సి అని జే.ఏ.సి లక్యూ తయారయ్యక ఇటు గుంజీ అటు గుంజీ ఎక్సాం డేట్ మర్చిపోయి రాయలేఅక పోయినందుకు పక్క పార్టీ వాఅరి మీద కోపం చూపిస్తారు!.

లోక్సత్త : ఇది అల్టిమేట్ భయ్యా.... ఒద్దికగా కూర్చుని ఎక్సాం లో ఇచ్చిన ప్రశ్నా పత్రం చూసి అడిష్నల్ మీద అడిష్నల్ తీసుకుని ఒక బుక్కే రాసి పడేస్తారు, ఎమన్నా అంటే ప్రశ్నలకి తగ్గ సబ్జెక్ట్ పుస్తకాల్లో లేదనీ మేమే చక్కటి విషయాలని రాస్తామనీ చెప్పి పేపర్ ఇచ్చి వెల్తారు ఆఖరికి ఆ దిద్దే వాడికి ఆ బుక్కు చదివె ఓపిక లేక ఆర్థం చేసుకునే ఙానం లేక పక్కన పెట్టేసి లోక్సాత్తా నmబెర్ రెసుల్ట్ పేపార్ లో లేకుండా చేస్తాడు.
ఇక రెసుల్ట్ ముందు అంతా ఎదురుచూస్తుంటే కాంగ్రేసు వారు మాత్రం.... papers దిద్దే చొట వెల్లి లంచాలు ఇచీ భయపెట్టో వారికి మంచి మార్కులు వచ్చేలా సెట్ చ్చ్చేస్సుకుంటారు(p.chidambaram 2009 ఎన్నికల్లో అక్రమంగా గెలిచాడు అనే కేసు ఇప్పటికీ కోర్టులో నానుతుంది!).

ఈ స్టోరీ మరెక్కడన్న కనిపిస్తే ఆ లింకు కామెంట్ లో ఇవ్వాగలర్రు choosiఆనందిస్తా!

Monday, 15 July 2013

సున్నా పుట్టుక

హైందవ సంస్కృతి, మానవ సమాజానికి దిశానిర్దేశంగా ఉండటానికి 4 వేదాలు ఇచ్చింది. మనిషికి అవి అర్దం 

కాలేదు .... సరే 4 వేదాలు తేలికగా అర్థం కావడానికి 6 వేదాంగాలని ఇచ్చింది మన హైందవ 

సంస్కృతి......అయినా అర్దం కాలేదు, సరే మట్టి బుర్రలు అనుకుని 16 ఉపనిషత్తులని ఇచ్చింది....... క్రతువుల 

గురించి సమూలమైన వివరణ తో కూడిన ఈ ఉపనిషత్తులు కూడా మనిషికి ఎక్కలేదు..... ఇలా కాదని 18 

పురాణాలు ఇచ్చింది..... ప్రకృతి లక్షణాల కాన్నుంచి వేద సారాన్ని నిజ జీవితం లో ఎలా పాటించాలొ 

తెలియడానికి కధలు కథలు గా వివరించింది... అయినా మనిషి మారలేదు వాటిని అర్థం చేసుకోలేదు... 

పాటించలేదు.

మరీ 18 అయితే ఎక్కువ అయాయి అనుకుని ...ఇలా కాదని రివర్స్ లో 2 ఇతిహాసాలిచ్చి మనుషుల ద్వారా 

చెపితే అర్త్దం అవుతుందని సీతారాములు.... ... భరత, శతౄఘ్న, లక్ష్మణ ... అనే మనుషులు వేద సారాన్ని 

చక్కగా పాటించి దేవతలు గా ఎలా మారారో రామాయణం ద్వారా .... భీష్ముడు, ధర్మరాజు, భీముడు,అర్జునుడు, 

నకుల సహదేవులు... శ్రీ కృష్ణుడు అని మహాభారతం ద్వారా మనిషి ఉన్నతంగా జీవించి సార్థకత ఎలా 

సాధించవచ్చో చెప్పింది.


ఊహూ ..... ఈ సారీ అర్థం  చేసుకోక అదే తీరు అదే అరిశడ్వర్గాలతో యుద్ధం  .... సరె ఒక్కటి  ఇస్తే 

సులువుగా అర్థం చేసుకు జీవితాన్ని సఫలం చేసుకుంటాడు .... అని ఈ సారి కన్ఫ్యూషన్ ఉండొద్దని 

శ్రీమద్భగవద్గీతా ఇచ్చింది మన హైందవ సంస్కృతి...... షరా మామూలే బాగా బలిసి మనిషి ఈ భగవద్గీతని 

కూడా అర్థం చేసుకోలేదు ... ఒకాటే అయినా సరళంగా ఉన్నా అరిశడ్వర్గాలు  ఆక్రమించిన 

కారణంగా గీతా సారం కూడా తెలియలెదు.

ఈ సారి చిరాకు వేసి మీ మనుషులు ఒట్టి వెధవలొయ్!(కన్యాశుల్కం గిరీశం లెవెల్లో!-వెధవలమే మరీ!) అని 

శూన్యం చూపించింది.... అంటే సున్నా ఇచ్చింది.

ఇదిగో ఈ సున్నాని పట్టుకుని మనిషి రకరకాలుగా వాడటం మొదలెట్టి ఈ డిజిటల్ ప్రపంచాన్ని శృష్టించాడు.... 

అత్యంత సరళమైన మానవ జీవితాన్ని సాఫీగా బతకమని భారత సంస్కృతి 4.....16....18....2.....1....0 అని 

సరళీకరిస్తే బాగా మతితప్పి కాంప్లెక్స్ ప్రపంచాన్ని మనిషి సృష్టించాడు!. 

ఇది దారుణం కదా!.

Friday, 12 July 2013

పాఠశాల కాస్తా స్కూల్ అవుతుంది!.

జీవితం అనే సముద్రం లో అభివృద్ధి అనే  అలల తాకిడికి జ్ఞాపకం అనే ఓడ కొట్టుకుపోయింది ..... చెల్లా చెదురై .... కనుమరుగయ్యింది!.
మరేం లేదు .... మా ఊరిలో ప్రాథమిక పాఠశాల కూలగొట్టి కొత్తది కట్టడం మొదలుపెట్టారు  .... నేను అ ఆ ... ల నుండి 5 వ తరగతి వరకు ఆ పాఠశాలలో చదివాను ఆ బడి నేడు గతం లో  కలిసింది జ్ఞాపకం కాస్తా గతం అయింది .... ఇప్పుడు అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

అప్పట్లో ఆ గేటు ఉప ద్వారం లోంచి వెళ్తూ ఎగిరి పైన కొట్టడం టార్గెట్ ఇప్పుడు మోకాలు వంచి మెడ వంచి దాటాలి .... అంతే  గదా మరి 3 ఫీట్ల నుండి 6 ఫీట్ల కి పెరిగే సరికి .... దాన్ని కూలగొట్టారు :( .
 కింది చిత్రంలోనిది పీర్ల కొట్టం ..... మొహర్రం పండగ అప్పుడు మాత్రమె, మిగతా రోజుల్లో 1 వ తరగతి గది!.

ఈ కింది చిత్రం లోని...   పెద్ద వేప చెట్టు  పురాతనమైనది ,  6 సంవత్సరాలు ఆ నీడలో...  ఆ గాలికి ఆడుకున్నాం నేడు కూలగొడతారేమో!??
 ఈ కింది చిత్రం లో ఉన్న పిల్లల లాగానే మేమూ కూచుని పలక తో కుస్తీ పట్టేవాళ్ళము :) .
వ్యాఖ్యను జోడించు

అసలు నా అనుమానం ఏంటంటే ఆ భవనం బాగానే ఉంది కానీ కొంత మంది రాజకీయం కోసం .... కొందరు కమీషన్ కోసం కలిసి కొత్త భవనం కావాలి అని ఈ పని చేశారు అని.  ఏదైతేనేమి .....ఉన్న ఆ కాస్త గ్రౌండ్ పోయి అచ్చం సిటీ లో ఉండే ఇరుకు స్కూలు అవుతున్ది. 

అంటే పాఠశాల కాస్తా స్కూల్ అవుతుంది!. 

Wednesday, 3 July 2013

ఎన్నికల పండగ(అప్పుడెప్పుడో రాసింది సీసన్ అని మళ్ళీ పోస్ట్ చేశా!)

ఎన్నికల పండగ .... ఎలాచ్చన్న్లు ఒస్తున్నాయహొ....!

అవునండి ఈ గ్రామపంచాయతి ఎన్నికలు అంటే మహా ప్రాధాన్యం ఎందుకంటే ఓటు హక్కు ఉండి తాగే అలవాటు  ఉన్న ప్రతోడూ తాగి తందానాలాడొచ్చని.

నిజం ...నిజ్జంగా నిజం 15ఏళ్ల పైబడ్డ వారికి ఈ కాలం లో మందు మహా  తేలికగా- తెరగా దొరుకుతుంది పైగా ఈ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్టు గదా ఇక పండగే అన్నమాట!.

నా గతానుభం ద్వారా ఇక్కడ చెప్పగలుగుతున్నాను(అంటే నేను బానిసనని కాదు నా ఫ్రెండ్స్ కొందరు ఇలాంటి సందర్భం లో చెడిపోయారు అలా!) ...కొత్తగా తాగుడు మొదలెట్టే కాలమిది, చాలామంది ఈ కాలం లోనే  మొదటిసారి మందు  ముడుతారు ఇక చూస్కో ఇప్పుడు మొదలెడితే సుమారు చచ్చే దాకా వదలరు ఇప్పుడు పడే బీజం మహత్తరమైనది మరి!!.

కాస్త సీరియస్ గా  రాస్తను....
నిజంగా ఎవరైనా సర్వ్యే  చేస్తే నిప్పులాంటి నిజాలు తెలుస్తాయి ఈ నిప్పులు  అడవిని కాల్చేవి కాదు కొంపలు కాల్చేవి ఇప్పుడు తేరగా వస్తుంది కదా అని అలవాటు లేని వాళ్లు కూడా తాగటం మొదలుపెడతారు,తర్వాత బానిసలై జీవితాలని నాశనం చేసుకుంటారు .ఈ పాపం అన్ని పార్టీ లది.

చిన్న చిన్న గ్రామాల్లో యువత తాగుడు మొదలెట్టే కాలం ఈ ఎన్నికల ప్రచారం తో ప్రారంభమౌతుందిం. అన్ని పార్టీల  లోకల్ నాయకులు వారి బావుల కాడ  -పొలాల వద్ద రాత్రి పూట రంజుగా ఈ "వైతరణీ నదిని పారిశ్తారు!!@!".

ఎవరూ దీన్ని ఆపలేరు ఎందుకంటే ఎన్నికల సంఘం కనుక ఎవరినైనా నియమిస్తే  వాడు అన్ని పార్టీల వద్ద ఇంత  తీస్కుని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అంతే .....  మిగతాది ఎప్పటిలానే.

మరి ఆపటం ఎలా..... హి హే  హె .... చెప్పటం కష్టం .
మీ కింద ఎవరైనా 15 ఎల్లా పైబడి ఇంకా మందేయటం నేర్వలేదంటే వారిని కాస్త 45 దినాలు కట్టడి చేస్తే చాలు.


లేదు మనమే మాచి ఎమ్.ఎస్ లము అయితే ఇంకేముంది నా రాజ కుమ్మిక ఎత్తే సీసకి దించే సీస కీ టైం గ్యాపు ఇవ్వకుండా .... పంచె నేతకి తాతలు గుర్తొచ్చేలా తాగింది ఎక్కడాని -దిగడాని కి కూడా కన్ఫ్యూస్ అయ్యేలా కుమ్మొదులు  అంతే !!!. 

Thursday, 28 March 2013

బాధ

మట్టి దిబ్బ్బల్లాగా.... రాళ్ళ తోనిండి  కుప్పల్లాగా ఉంటె గడ్డపార పోటు .....చదునుగా ఉంటె నాగలిపోటు ...తప్పదు భూమికి గాయాల బెడద .... మంచిగా ఉండి  నిజాలు పలికితే మనిషికి ఆటు పోటుల  బెడద !

భూమి నొచ్చుకుంటే ఫలితం పంట..... మనిషి మనసు నొచ్చుకుంటే ఫలితం వ్యధ ఎందుకీ తేడా?
నిజం పలికితే శిక్ష పడుతుంది అని తెలిసిన తర్వాత నిజానికి మిగిలే విలువ ఏమిటి?
అబద్దం చెబితేనే జీవితం అన్నప్పుడు ..... మంచిపనికోసం అబద్దమాదవచ్చు అని గుర్తుచేస్తారు ఇక్కడ మంచి ఎది... ఎవరికొసమ్..... నాకోసం జరిగే మంచి స్వార్థం అవుతుంది కదా....

Friday, 22 March 2013

ఓటరు - నాయకుడు - రాష్ట్ర పరిస్తితులు ఒక సరదా వాదం!

సరాడా కి వచ్చిన డౌటు .... గతం లో మా గ్రామం లో నేను ఒక వ్యక్తీ తో ఎన్నికల గురించి మాట్లాడా అది 2003-4 ఎన్నికల సమయం లో అప్పటికి నాకు ఓటు హక్కు లేదు ,నేను 8వ తరగతి లో ఉన్నాను అనుకుంటా .... అప్పుడు నేను నారా చంద్రబాబు నాయుడి గారికి సపోర్ట్ గా మాట్లాడితే ... ఆ వ్యక్తీ నాతో వాదించాడు అప్పటికే ప్రతి రోజు పేపర్ చదివే అలవాటు ఉన్న కారణంగా కాస్త గట్టిగానే సమాధానం చెప్పా అయితే ఆ వ్యక్తీ అన్నాడు నీకేం తెలుసు ఓటు హక్కు కూడా లేదు గానీ చెప్పొచ్చావు అని అప్పుడు తను కాంగ్రెస్స్ కి - వై.ఎస్. రాజశేఖర రెడ్డి కీ సపోర్టు గా మాట్లాడుతుంటే నేను కాంగ్రెస్స్ - సోనియా గురించి విమర్శిస్తున్నాను.

అతను ఒక కొత్త పాయింటు చెప్పాడు అదేమంటే .... చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులపాయిన అతనికి వరుణ  దేవునికీ పడలేదు కనుక రైతులు అల్లాడుతున్నారు నువ్వు తినే తిండి గింజలు రైతుల కష్టమే వారికి అససలు అనుకూలంగా లేదు నీ చంద్రబాబు పేరు మీద వర్షాలు లేవు కనుక మా వై.ఎస్. రెడ్డి వస్తే ఆటను రైతు బిడ్డ కనుక వారున దేవుడు కరునిస్తాడు ఆయన రాష్ట్రాని కి అధికారి అయితే ఆయన రైతు మనిషి కష్ట జీవి కనుక అలానే రాష్ట్ర పరిస్థితులు ఉంటాయి అని ! .
ఓరి నీ తెలివి కూల రాష్ట్రం లో వర్షాలు పడనిది చెట్లు లేక పర్యావరణం బాగా లేక వరునదేఉడికి కులాలేంటి బాబు అనుకుని .... వర్షాలు లేవనే చంద్రబాబు చెట్లు నాటే పని చేసాడు కనుక అవి పెద్ద అయ్యి వర్శాలిస్తాయి ఈ తరం గెలిస్తే వర్షాలు బాగానే ఉంటాయి అని నేనంటే చెట్లకి వర్శాలకీ సాంబ,మదం ఏమిటి అని దబాయించాడు నేను ఏమనలేక్పోయాను అప్పట్లో చిట్టి 8వ తరగతి బుర్రకి వాదించడానికి పాయింటు దొరకలేదు!

అయితే ఈ వాదన చేసింది రెడ్డి కాదు అతను ఒక హరిజనుడు కాంగ్రెస్స్  కి వీరాభిమాని/.  ఇందిరమ్మ మహాత్మా గాంధీ కోడలని,  గాంధీకి సపర్యలు చేసిందనీ వాదిస్తాడు.  సోనియా గాంధి మహాత్మా గాంధీ  చుట్టమని వాదిస్తే విపరీతంగా వాదించే వాడిని ఫిరోజ్ గాంధీని దత్తతకి తీసుకోలేదు గాంధీ ఇందిరాగందీ పెళ్లి గాంధీకి సంబంధం లేదు ఆమె పెల్లప్పటికి గాంధీ స్వాతంత్ర్యపోరాటం లో బిజీ గా ఉన్నాడు  అని ..... కానీ ఆ మహానుభావుడు వినలేదు ఇలానే చాలా మంది వృద్దులు సోనియా గాంధీ లోని గాంధీ అనే పదం మహాత్మా గాంధీ లోని పదం ఒకటే కనుక వారు గాంధీ వంశస్తులు అని భావించి ఓటేస్తూ వస్తున్నారు.! ఇప్పటికీ తన ఇంటి గోడలకి కాంగ్రెస్స్ రంగు వేసుకుని వోటేసే అమాయక ఓటరు !.

అయితే ఈ మొత్తం సంభాషణ లో నన్ను బాగా తికమక పెట్టిన మాట రెడ్డి గారు రైతు కనుక వర్షాలు బాగా పడతాయి  ఒకవేళ రాజశేఖర రెడ్డి కాక పొతే డి. శ్రీనివాస్ కానీ రోశయ్య కానీ అయితే కాస్త వేరుగా ఉంటుంది మళ్ళీ ఇక్కడ రోశయ్య వస్తే రాష్ట్రం లో వ్యాపారం బాగుంటుంది అని జోస్యం చెప్పాడు .....

ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తుకు వచ్చిందంటే మన ప్రియతమా నేత మనం ఓటేసి తిరుగులేకుండా గెలిపించుకున్న చిరంజీవిగారు (ఓటేసామా .....ఓ రాజ్యసభ కదూ ... ఈసారి లోక్సభ ఎన్నికలకొస్తే తెలుస్తుంది అసలు విషయం! ) మన దేశ పర్యాటక మంత్రి గా నియమితులయ్యారు ... .సొ మాంచి జనాకర్షణ గల నేత కనుక విదేశీయులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది పైన చీపిన జోస్యం ప్రకారం . కానీ ప్రస్తుతం జరుగుతున్న అంశాలు చూస్తుంటే  ఎక్కడో తేడా కొడుతుంది ------మరీ ఈ ఆక్రుత్యా లేం  టం డి  బాబు విదేశీ పర్యాటకులు బెమ్బెలేట్టేలా ఈ అఘాయిత్యాలేంటి .... పై జోస్యం ప్రకారం ఈయన తీరు అంచనా వెస్తే  బాబోయ్  తట్టుకోలేను తెలివోచ్చిన  నాటి నుండి 15 సంవత్సరాలు అభిమానిగా ఉన్న నా హృదయం చిన్నబోతోంది !.

అయినా ఒక సాధారణ ఓటరు ఇంత దారుణమైన అనాలసిస్ తో ఓటేస్తే జయప్రకాశ్ నారాయణ గారు ఎంత కష్టపడితే నోటుకు ఓటు ను ఎదిరించగలడు ..... మోడీ ఎంత పని చేసి ఎంత ప్రచారం చేసినా ఇలాంటి వారి ఓటును పొంద గలడు ?

అసలు రామా రావు గారు మహానుభావుడండీ ఎంత గొప్ప ప్రయత్నం చేసుంటే  ఇందిరమ్మ ని ఎదుర్కొన గలిగాడు !.
ఎన్నికల తర్వాత 1 సంవత్సరం లోపే వర్షాలు విస్తారంగా పడడటం ఆ కాగ్రేస్స్ సపోర్టరు నా వంక చూస్తూ గర్వం ప్రదర్శించడం అలా జరిగిపోయాయి .... ఎం చేస్తాం అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి .... ! :)
ఓటరు - నాయకుడు - రాష్ట్ర పరిస్తితులు ఒక సరదా వాదం!





దురాచారం

మన ఇతిహాసాలలో కానీ, ఆధునిక చరిత్రలో కానీ (క్షమించాలి ఇదొక బండ తప్పు చరిత్ర అంటేనే గతం మళ్ళీ ఆధునిక చరిత్ర ఏంటి?)కట్నం ప్రసక్తి వచ్చినట్లు నే వినలేదు .... కుచేలుడు ఎంత కట్నం పొందాడు,త్యాగరాజు పొందిన కట్నం ఎంత ..... పోనీ సాధారణ జనానీకం లో వధువు చెల్లించిన ధనం ఎంత ఉండొచ్చు ఎక్కడ తగు ఆధారాలు లేవు.
ఈ కట్నం అనే దరిద్రం పరాయి పాలనలో ముఖ్యంగా స్త్రీ అంటే పరదాల చాటున ఉండాలి అనే వారి పాలన లో మన బారతీయ సంప్రదాయం లో ప్రవేశించింది .
ఇన్నేళ్ళ దాస్యం ముగిసినా నేటికీ అవసరాల కి అనుగుణంగా మారుతూ అలా మన సంప్రదాయం లో కలిసిపోయిన ఒక దురాచారం  ఈ వరకట్నం ...... అబ్బాయి వయసులో ఉంటే కట్నం .... అబ్బాయి ముసలివాడయితే కన్యాశుల్కం .

ఇప్పటికీ దుబాయికి అమ్మాయిలని అధికారికంగా అమ్ముకుంటున్న పేద కుటుంబాలు ఎన్నో ..... మరి పోరాడి స్వేచ్చని తెచ్చుకున్న భారతీయులు 65 ఏళ్లయినా ఈలాంటి కొన్ని దురాచారాలని చేరపలేదు ఎందుకు .

Thursday, 21 March 2013

ప్రభుత్వోద్యోగి

కొన్ని లక్షణాలు ఎన్నేళ్ళైనా పోకుండా అలా ఉండిపోతాయి
స్వాతంత్ర్యం రాక ముందు ఏదైనా ప్రభుత్వ పని మీద ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్తే అక్కడ సిబ్బంది కాస్త కటువుగా వ్యవహరించడం జరిగేదట మరి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఈ కటువుగా వ్యవహరించడం అన్న లక్షణం మనలో పోలేదు ఈ మాట బలరాం  సహాని గారి  ఉపన్యాసం లో చదివా !

అది ఇప్పుడు కాస్త పెరిగి ప్రభుత్వోద్యోగి అంటే పొగరుగా వ్యవహరించడం లా తయారైంది ఎదుటి వారు  ఎంత వారైనా చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస మర్యాద లేకుండా మాట్లాడడం సర్వసాధారణం.ఎరా -పోరా కూడా అప్పుడప్పుడు వింటుంటాం ,ఒక సాధారణ పౌరుడికీ ప్రభుత్వోద్యోగికి మధ్య ఉండే సంబందం భయం తో కూడి ఉంది ఎందుకు?

బ్రిటీషు వాడు వద్దు కానీ వాడి భాష కావాలి - వాడి వేశాదారాణ  కావాలె.

ఈ మధ్య పెళ్లి విందు లో చక్కగా మన బట్టలేసుకోక కోటు ధరించడం  సాంప్రదాయం అయిపొయింది.  ఈ ధర లో కోటు ఉండాలి అని అమ్మాయి వారిని ఇబ్బంది కి గురిచేయడం కూడా జరుగుతుంది ఈ  వేడి దేశం లో నిండుగా కోటు ధరించి చెమటలు కక్కుతూ ఫొటోలకి పొజులు ఇవ్వడం ఏంటో అర్థం కాదు.

కాస్త గమనిస్తే మనిషి వస్త్రాధారణ  చూసి ప్రభుత్వోద్యోగి అని పసిగట్టగలం ఏతా  వాతా  నే చెప్పాలనుకునేది ప్రభుత్వ రంగ  ఉద్యోగులు మిగతా జనానీకం తో కలవక ఏదో కొంత ప్రత్యేకత చూపుతూ ఉంటారు.

మిగతా పౌరులతో కుదిరినంత నిర్లక్ష్యంగా ఉంటారు !. 

ఒక మాట

చావడానికి బతకాలి అంటే .... చచ్చే దాకా బతకాలి కానీ బతకడానికి చావకూడదు అంటే చస్తూ బతక కూడదు
ఎందుకు వచ్చిందో ఈ వాక్యం నా మెదడు లోకి తెలియదు కానీ ఇక్కడ భద్రపరిస్తే ముందు ముందు చూసుకుని మురవచ్చ్చని రాసేశా !!

Wednesday, 20 March 2013

బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్

జర్మనీ లో రైల్వే ట్రాక్ బ్రిటీషువాడు వేయలేదు, అయినా జర్మనీ అభివృద్దిని సాదించింది కదా మరి ఇప్పటి తరం "బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ ", రైళ్ళు వాయించారు ,బ్రిడ్జీలు వేయించారు అని వాదిస్తారు కాలేజీలేదా ప్రాంగణ  నియామకాల్లో జరిగే బృంద చర్చల్లో అతి సాధారనంగా వినిపించే పొగడ్తాపూర్వక వాక్యాలివి కేవలం ఉద్యోగం కోసం / గుర్తింపుకోసం బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ అనగలిగే నేటి యువత బ్రిటీషర్స్ ఆర్ థీవ్స్ /బుర్గ్లేర్స్ .... నా దేశాన్ని దోచుకుంటున్న దొంగల్లారా పారిపోండి అని పోరాడి ప్రాణాలర్పించిన భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలం అయినా స్వేచ్చా స్వాతంత్ర్యాలని అనుభవించ అర్హులా  వారికి వారసులా ?

సరే మన నేతలు దోచుకుంటున్నారు వారికి దోచుకునే అధికారం, అవకాశం ఇచ్చింది మనం కాదా...
ఇక్కడ తప్పు, మన జనం , మన దేశాస్తులైన నేతలది అంటే కానీ హటాత్తుగా బ్రిటీషు వాడు గొప్పవాడు అయిపోదు కదా !
ఒక వేల గొప్ప వాడు అనుకుంటే మన పూర్వీకుల పోరాటం చెడ్డదా ..... కాదు కదా మరి బ్రిటీషర్స్ ఆర్  గ్రేట్ అని ఎలా అనగలరు ?

కొన్ని వందల ఏళ్ళు కొన్ని వందల రాజ్యాల రక్తం తాగిన బ్రిటీషు సమాజం నేటికీ ధనిక దేశం గా ఉండగలుగుతుంది
అంటే ఎంత సంపద దోచారు అని అర్థం.  ఇంగ్లాండ్ జనాభా - పంట భూమి నిష్పత్తి ఏ  పాటిది,అయినా సకల సౌకర్యాలతో తులతూగుతుంది అంటే ఎన్ని ఏళ్ల కి సరిపడ సంపద దోపిడీకి గురైందో కదా. మరి గొప్పతనం ఎక్కడినుండి వచ్చింది దాస్యానికి తహ తహ లాడుతున్న కొంతమంది ని చూస్తె జాలి వేస్తుంది కానీ కోపం రాదు కానీ ఎదుటివాడికి ఆ జాలి కోపం లా కనపదుతుంది .
ఇంగ్లాండ్ లో దొరికే ఖనిజ సంపద ... శిలజ ఇంధనం .... సహజ సంపదలు ఏ పాటివని ధనిక దేశం లా ఉంది పెట్టుబడి దారుగా మనగల్గుతుంది ?
అరబ్ దేశాలని, ఆఫ్రికా దేశాలనీ గత కొన్ని  దశాబ్దాల వరకు పాలించిన రక్కసులు నేటికీ అనధికారికంగా కొన్ని దేశాల ని శాసించే స్థితిలో ఉన్న జలగా లాంటి వారు గొప్ప ఎలా అవుతారు.
ఇలాగని వారంటే నాకు పర్సనల్ కసి ఉందని కాదు వారిని నా నిజ జీవితం లో చూస్తె గొడవ పడతానని కాదు కానీ నా ముందు ఎవడన్నా బ్రిటీషర్స్ ఆర్ గ్రేట్ అంటే కోపం ఆగదు ,అవినీతి గురించి-నల్ల ధనం గురించి చర్చ వస్తే బ్రిటీషర్స్  ఆర్ గ్రేట్ అంటారు వెధవది ఎం జన్మ .... వాడు దొచుకొలెదా... అయినా దోపిడీ జరుగుతుంది అని తెల్సినా ఓటు వెయ్యరు (నేటికీ లోక్సభ ఎన్నికల్లొ నమోదయిన ఓటింగ్ శాతం 70 దాతలేదంటే ఎంత నిర్లక్ష్యం!). మంకు ఒకే పార్టీ కావలి అనుకుంటే మరి ప్రజాస్వామ్యం ఎన్నికలు ఎందుకు సరే బహు పార్టీలు ఎన్నో ఉన్నాయి అంటే జనం ఎందుకు దొంగలకి పట్టం గడుతున్నారు దొంగలకి ప్ర్రతినిధ్యం వహించే అవకాశం ఎందుకిస్తున్నారు ...

INDIA IS GREAT BUT NOT INDIANS అనేది నిజం, అక్షరసత్యం. శత్రువుని ప్రశంసించడం(శత్రు పొగడ్తకన్నా)  కన్నా ఆత్మ నింద ,ఆత్మ విమర్శ మేలు.
  

వ్యవసాయం - వెతలు


గెరిల్ల పోరాటం చేసిన రైతాంగం నేడు మళ్ళీ మరోపోరాటం చేస్తే గానీ మారని స్తితిలో ఉన్నారు మన నాయకులు.  కానీ దురదృష్టవ శాత్తు పోరాడి రైతుగా నిలవాలనుకుంటున్న యువత నేడు దేశం లో లేదు.  దేశం మొత్తం లో ఏ  15 ఏళ్ళ  బాలున్ని పెద్దయ్యాక ఎమౌతావ్ అని అడిగితె రైతు ని అయ్యి బాగా పంట పండిస్తా అనే సమాధానం రాదు భూమి ఉన్నోడి  కొడుకు అమెరికా, విదేశీ  కలలు కంటాడు - భూమిలేని వాడి కొడుకు బ్రతుకుదెరువు కలలు కంటాడు. 
అసలు వ్యవసాయ ఆధారిత దేశాన్ని స్కాముల ఆధార - విదేశీ మారకం ఆధారిత దేశంగా మార్చిన ఘనత మన నాయకులది కాదా? 
FDI లు వస్తే రైతులకి మంచిది అని అనుకునే స్థితి  ఎందుకు వచ్చింది ?

ఈ నాయకుల కక్కుర్తి  కారణంగా కనుమారుగైన పొలాల భూముల్ని నేడు దేశ పఠం లో చూపగలరా? భూమి ని కూడా మింగుతూ ఉన్న వీరి ఆకలి కి అంతు  లేదా?... పండిచే పంట లేనప్పుడు తినడానికి గింజలెలా  వస్తాయి?
కాక్రీటు అడవులు డబ్బుల్ని కాయించ గలవు కానీ తిండి గింజలని కాదు ప్రపంచమంతా నగరాలైతే డబ్బులెన్ని పోసినా తిండి దొరకదు/ముట్టదు  . 
మరి మన నేతలు పల్లెలని మునిసిపాలిటీ లుగా -మునిసిపాలిటీలని నగరాలూ గా మార్చడానికి ప్రయత్నిస్తారు ఎందుకు ? నేడే పేపర్ లో చూసా వరంగల్లు చుట్టుపక్కల 42 గ్రామాలని గ్రేటర్ వరంగల్లు గా మారుస్తూ జి.ఒ జారీ చేసారని. 
జి.ఒ లు జారీ చేసే వీరికిఓటరు కూడా నిండు సహకారం అందిస్తాడు ఏం  కోరుకుని ..... ?
వ్యవస్థ పరుగు ఎటువైపు సగటు మనిషి చూపు దేని వైపు ఆకలి వైపా ...... సౌక్యాల వైపా ? 
మునిసిపాలిటీలు గా మారితే వ్యవసాయ భూములకి వచ్చిన తిప్పలెంటనా డౌటు ..... వ్యవసాయ భూముల్ని ముఖ్యంగా చేరువులని ఆక్రమించి భూ కబ్జా అని ప్లాట్లు చేసి తినేస్తారు గదా.....! 
పేపర్ లో చూడటం లేదా చెరువులు మాయం అయిన వార్తలు! మునిసిపాలిటీ అయ్యాక మెల్లిగా పంట పొలాలని ప్లాట్లు చేసి వ్యాపారాత్మక ప్రదేశాలు గా మార్చి రియల్ ఎస్టేట్ దండా పేరిట పంట భూములని స్వాహా చేస్తారు!. 

అన్న దాత ఆకలి కేకలు పట్టని ఈ నేతల పాట్లు ఇంకేవరికోసం వీరి చట్టాలు  దేనికి ?
ఒక ఆటగాడు కొన్ని సిరీస్ లలో విఫలం అయితే తీసేస్తారు ఒక నటుడికి విజయాలు లేకపోతె అవకాశం  లభించదు మరి నా నాటి కీ దేశం లో రైతులు దీనావస్థ లోకి దిగజారుతుంటే .... 10 ఏళ్ళు గా ఆ మంత్రిత్వశాఖ  ఒకే వ్యక్తీ ఆధీనం లో ఉండటం ఎందుకు దాన్ని వదలని  ఆ వ్యక్తి  ఉద్దేశ్యం ఏమిటి? తన విధానాలు రైతుల ఆత్మా హత్యలని తగ్గించాయనా.... 

ప్రతి ఏటా రైతుల ఆత్మా హత్యలు పెరుగుతూన్నా రైతుకు కనీసం న్యాయం జరగకున్నా ఒక వ్యక్తి  మాత్రమె వ్యవసాయ శాఖా మంత్రిగా కొనసాగటం విడ్డూరం. 
టెర్రరిస్టులు వచ్చి కొంతమందిని చంపుతారు ... 2 లేదా 3 దాడులకొక సారి భాద్యత వహించి హోంశాఖా మంత్రి -రక్షణ శాఖా మంత్రి రాజీనామా చేస్తారు లేదా తొలగిస్తారు .... మారాతారు కానీ, ఏళ్ల తరబడి లక్షల మంది రైతులు మరణించినా మంత్రి మారడేమి మీడియా అరవదేమి, గోలచేయదేందుకు?. 
టెర్రరిస్టుల చర్యలకిచ్చిన ప్రాధాన్యత రైతు మరణాలకి లేదెందుకు?
గత 10 ఏళ్ల ల్లో ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి సంఖ్య గాయ పడ్డవారి సంఖ్యా   కలిపినా - ఆత్మ హత్య చేసుకున్న రైతుల సంఖ్య నే అధికం కదా మరి రైతు మరణాలపై ఈ ప్రభుత్వం  తీసుకున్న చర్యలు అంత  వేగంగా లేవెందుకు?

వికీ పీడియా లో వెతికితే కింది లైన్లు దొరికాయి ఈ పెద్ద మనిషి వివరాలు . 
After 2004 Lok Sabha elections, he joined the United Progressive Alliance government headed by Manmohan Singh as the Minister of Agriculture.
On 29 November 2005, he was elected President of Board of Control for Cricket in India (BCCI).
He was appointed Union Minister of Agriculture and of Consumer Affairs, Food & Public Distribution on 28 May 2009.  






నల్లధనం

నల్లధనం - ఒక ఉద్యోగి 2 లేదా 3 లకారాలు ట్యాక్స్ తప్పించుకోవడానికి నానా తంటాలు పడి  దొంగ ఆధారాలు చూపి తక్కువ మొత్తం లో నల్లదనాన్ని కూడబెడితే మన ప్రియతమ రాజకీయనాయకులు తమ తమ స్థాయిని బట్టి ఒక సున్నా పెంచుకుంటారు .....
3 లకారాలు -ఉద్యోగి
30 లకారాలు -ఎమ్మెల్యే
3 కోళ్ళు  -రాష్ట్ర మంత్రి
30 కోళ్ళు -ఎమ్.పి
300 కోళ్ళు - జాతీయ స్థాయి మంత్రి ...... కాస్తా అటుఇటు గా ఉన్నా లక్షల కోట్ల డబ్బు మాయం అవడం మాత్రం అతిశయమే కానీ కాదేదీ వీరి కి  అసాధ్యం!

ఇప్పుడు నాదొక అనుమానం వచ్చే ఎన్నికల్లో ఎ. రాజా కనుక పొటీ చేస్తే ఓటర్లు గెలిపిస్తారా - ఓడిస్తారా కనిమొషి /కనిమొళి  పోటీ చేస్తే ఓటర్ల సమాధానం ఏమిటి?

నా చిన్ని మెదడుకి తట్టిన సమాధానం  గెలిపిస్తారు ఘంటా భజాయించి చుక్కలు చూసే మెజారిటీ తో గెలిపిస్తారు ఎందుకంటే దోపిడీ సాధారణం అయిపొయింది ...... ఎవడికాడు నొక్కడం నేర్చి, నల్లధనం  కామన్ అయి ..... గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి లాగా నల్లదనం, స్కాములు అతి సాధారణ విషయాలు వీటిని అడిగే వారే బుద్ది తక్కువ జీవులు అవుతారు.

రాను రాను కూటముల ప్రభుత్వాలు ఏర్పడి మీ రాష్ట్రం వారే స్కాము చేసారు మా రాష్ట్రం వాళ్ళు చేసింది ఎంత పితకంత మీ రాష్ట్రం వారే ఎక్కువ నొక్కారు అని తప్పించుకుని ఎదుటివారి తప్పు ముందు తమ తప్పును తక్కువ చూపి పిచ్చి జనా లని నమ్మిస్తారు.

చ నా పిచ్చి కాకపొతే  జనం పిచ్ఛి వారేంటి వారు అతి తెలివైన వాళ్ళు అందుకే ఎన్నికల పండగప్పుడు దొరికినంత దండుకుని హాయిగా ఉంటారు(ఉంటాము అనుకుంటారు పెరిగే ధరలు త్యాక్సులు లెక్కలోకి రావు!). 

ఫేస్బుక్

ఫేస్బుక్ లో ఫూట్బాల్ వీడియో గేమ్ ఆడి  చెమటలు తెచ్చుకోవటం ఎంత అతిగా ఉంటుందో ..... అలాగే ఫేస్బుక్ కమెంట్లో  క్లాస్స్ పీకి ఎదుటి వాడికి జ్ఞానోదయం చేయటానికి ప్రయత్నించడం లేదా మార్చాలనుకోవడం అంటా అతిగా ఉంటుంది కనుక ఫేస్బుక్ లో నచ్చితే లైక్ /షేర్ .... నచ్చకుంటే తీసి పారేయి లేదా రిపోర్ట్ / స్పాం  .... అంతే  గాని ఎదుటో డు తెలిసినోడే కదా అని ఏదో చెప్పాలని ప్రయత్నిస్తే వర్చు వల్ లైఫ్ కాస్తా ఒరిజినల్ లైఫ్ ని కంగాళీ చెసి  పారేస్తుంది!

Tuesday, 12 March 2013

తెల్ల మోజు

కనీసం 10 పార్టీలు కలిస్తే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేము అని అన్ని పార్టీలకీ బాగా తెలిసినా అంతా  మోడీ ని విమర్శించి....సాధ్యమైనన్త విషం కక్కి భాజాపా కు వచ్చే కొన్ని ఓట్లని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు కానీ .... కాంగీ చెఅసిన దోపిడీని విమర్శించె ధైర్యం అటు మీడియా కి గానీ ఇటు వ్యక్తులకి గానీ లేదు కాంగీ కి ఇంత  బానిససలు ఉన్నారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది రక్తం పీల్చి స్విజ్ బ్యాంకు లు నింపుకున్నా స్కాములు చేసి టాక్సు లు పెంచినా కాంగీ కి మాత్రమె ఓటు వేస్తాం భాజాపా కానీ మరే పార్టీ కానీ వద్దు అనే వాళ్ళు ఉన్నంత కాలం స్కాములకి దేశాన్ని దోచే జి.ఒ లకీ కొదువేముంది రాజా..... !

మోడీ వద్దు మోడీ వద్దు అమ్మే ముద్దు అదేగా నర- నరాన జీర్ణించుకు పోయిన బానిసత్వపు బుద్ది తెల్లోడి దెబ్బ కావాలి తెల్ల తోలు పిల్ల కావాలి కానీ మనోడు వద్దు వాడి బూచీ చూపి, మరొకడు కూడా కావద్దు.....  బొమ్మ అమ్మా దొచుకొమ్మా.... అందుకే టాక్స్ కడతాము తీసుకెళ్ళి స్విజ్ బ్యాంకు నింపుకో ... !!.


మళ్ళీ UPA అభ్యర్థే ప్రధాని అయితే కాస్త దాక్కుని జరుగుతున్నా నియంత-తత్త్వం పురివిప్పుకుని ఆడుతుంది అప్పుడు దూల తీరుతుంది !.

Thursday, 7 March 2013

యు.పి.ఎ -తెలంగాణా

యు.పి.ఎ -తెలంగాణా
అసలు ముందుగా యు.పి.ఎ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అంచెలంచెల అధికార పంపిణీ విధానం గురించి చెప్తా.
అసలు రాజ్యాంగం లో మంచి కోసం కల్పించిన అధికార వికేంద్రీకరణ అనే అంశాన్ని అత్యంత నూతన పద్దతి లో దుర్వినియోగపర్చిన ఘనత ఈ యు.పి.ఎ ప్రభుత్వానికి దానికి అధికారం కట్టబెట్టిన ఈ తరం ఓటర్లకే చెందుతుంది!.

ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ నేతల పాట్లు చూస్తె ఇటు తెలంగాణా నేతలు గానీ, అటు సమైక్యాంధ్ర నేతలు గానీ ఎవరైనా, ఎపుడైనా రాష్ట్రానికి సంబందించిన అతి కీలకమైన విషయం  గూర్చి మాట్లాడేప్పుడు  ప్రధాని గారికి విన్నవించాము  అని గానీ ప్రధాని గారితో చర్చించాము అనిగానీ అన్నారా?, ప్రతిభాపాటిల్ గారి పేరు ఎన్నడైనా ఎత్తారా?,

 నేను బాగానే వార్తలు గమనించా ఎప్పుడు చూడు సోనియా అమ్మ కు చెప్పాం, సోనియా అమ్మకు రాజీనామాలు సమర్పించాము, సోనియా అమ్మకు ఫ్యాక్స్  ద్వారా లేఖలు-రాజీనామాలు అందించాము అంటారుగానీ రాజ్యాంగబద్దమైన విధంగా తెలంగాణా విషయం లో ప్రధాని-స్పీకర్-రాష్ట్రపతి పాత్రలు గుర్తుకురాలేదెందుకు?
ఇక్కడ రెండుప్రాంతాల నేతలు దొందు -దొందే అనా చందాననే ఉన్నాయి కానీ తెలంగాణా అంశంలో లోపం లెదు.

నా అభిప్రాయం జై తెలంగాణా .
విషయం లోకి వస్తె.... మరి ఇన్ని విధాలా అమ్మ తో పోరాక ఈ మధ్య నేతలు కాస్త హొమ్-మంత్రి గారి పేరు ఎత్తుతున్నారు అదీ అడగటానికి ఎందుకంటే షిండే గారు అలవాటులో పొరపాటుగా నెల అని మాటిచ్చారు కనుక  ,అంతకు ముందు చిదంబరం గారిని విమర్శించాడానికే గుర్తు చేసే వారు గాని పని గురించి కాదు!.

మరి అన్ని అధికారాలను కేంద్రీకరించి తన వద్ద పెట్టుకున్న  అమ్మ చేసిన నిర్వాకం అల్లుడిగారికి విమానాశ్రయాలల్లో తనికీలు చేయకుండా జి.ఒ జారీ చేసారు దానికి మిగతా వారు ఎలా సమ్మతం తెలిపారో ఏమనుకున్నారో తెలియదు ఒకవేళ ఈ జి.ఒ ని పార్లమెంట్ లో ఒతిన్గుకి పెట్టితే మన ఆంధ్రప్రదేశ్ నాయకులు పోటీ పది మరి అనుకూల ఒతేస్తారు ఇంట బానిసత్వం ఏమిటో?...కుదిర్తె 2...... 3... ఒత్లేసేరకాలు మన A.P నాయకులు.

స్కాములు అని గోల మొదలెడితే చాలు అధికార పార్టీ వాళ్ళు - ప్రతిపక్షం వాళ్ళు అటు-ఇటు గాని BSP ,SP నాయకులు  అంతా ప్రధాని ని సంజాయిషీ అడుగుతారు ఆయన నిన్నటి లాగే అడిగిన వారిని శాపనార్థలెట్టి  చేతులు దులుపుకుంటాడు .... "అధికారానికి అమ్మ, సమాధానానికి  -అవినీతి ప్రభుత్వానికి అతి నిజాయి తీపరుడైననామ మాత్రపు నాయకుడు ".ఇదెక్కది న్యాయం?

ఆ మధ్య కోల్గేట్ స్కాము విషయం పై  జరిగిన  చర్చలోనూ ఇదే విధంగా బ్లాక్ మెయిల్ ఉపన్యాసం అందులో కొన్ని శాపనార్థాలు ఇదేనా భాద్యత గల ప్రధాని విధానం .
అంటారు అనడానికే ప్రతిపక్షం ఉంది జరుగుతూన్న ఘోరాలు సాధారనమైనవా ?

రక్షణ లేదు, ఉగ్రవాదం , మాట్లాడితే చాలు లక్షల కోట్ల స్కాములు ఎక్కడి దా  డబ్బు అమ్మ ఒల్లోది కాదు కదా, మరి అడుగుతారు అక్షతలు వేస్తారు తుంటరి పిల్లగాల్ల గ్యాంగ్ కి నాయకుడంటే ఆ మాత్రం మాటలు పడాలి తన చుట్టూ ఉన్నది అతి నీతిపరులు కాదాయె!.

కొసమెరుపు అభిషేక్ సింఘ్వి ఘనుడు మళ్ళీ క్రియాశీల రాజకీయాలలోకి వచ్చారు కాంగ్రెస్ వారు చాలా గర్వపడుతున్నారు అతని సేవలు పొందడానికి . మరియు మన నారాయణ్ దత్ తివారీ గారు ఉత్తర ప్రదేశ  రాష్ట్రానికి 4 పర్యాయాలు ముఖ్యమంత్రి గా సేవలు అందించారు అందుకే ఇప్పుడు జరుగుతున్నా నేరాలు- ఘోరాలల్లో ఆ ప్రాంత పాత్ర ఎక్కువ ఉంది 

Tuesday, 5 March 2013

పుత్తడిబొమ్మ

పుత్తడిబొమ్మ ...ఈ సినిమా యూట్యుబ్ లో దొరికితే చూసా ఇడి  10 సారో 20 వ సారో అయ్యిండొచ్చు .....అసలు ఆ  సీరియస్ అంశం మీద సినిమా తీస్తూ మేక (మేధావి కవి ) కామెడీ తో చంపాలని ఆలోచన ఎలా వచ్చిందో మాష్టారు గారికి!.
వితంతు పునర్వివాహాలు- వరకట్న పిశాచం ఈ రెండింటి మీదా చాలా పదునైన  విమర్శ ఆసాంతం కొనసాగుతుంది  ఈ సినిమాలో.  అలానే  పోట్ట చేక్కలైపోయే హాస్యం.  ఇవి  నిజజీవితం లో మనం చూసే పాత్రల లానే ఉంటాయి (నిజంగా  ఒక్కరైనా ఎదురుపడతారండీ ఈ కవిత-తవికా జ్ఞానులు ).

ఒక సీన్ లో సుత్తి వేలుని కూతురు అరుణ అడుగుతుంది ఎందుకు తాగుతావు నాన్నా ఈ పాడు కల్లుని, ఏముంది దాన్లో?  అని, దానికి వేలు జవాబు "నేను అదే అనుకుంటానమ్మా ఏముంది దీన్లో చూసి తీరాలని అంతు చూడాలని  కానీ సగం తాగే సరికి  తలకెక్కి పోతుంది అని  " . ఎంత అమాయకంగా ఉంటుంది ఆ నటన -జవాబు తాగుబోతు తండ్రి తో చాలా సాధారణంగా జరిగే సంభాషణ అది అందులోంచి మనకు హాస్యరసం తీసి ఇచ్చారు మాష్టారు!.

ఇందులో డీల్ చేసిన విషయాలు అప్పట్లోనే కాదు నేటికీ తీవ్రమైన స్థాయి లోనే  ఉన్నాయి 80 వ దశకం లో ఈ విషయం పైన సినిమా తీసి జనం మెప్పు పొందటం అంత  తేలిక కాదు, అది వారి నరనరాన నిండుకుపోయిన ఆచారానని  ప్రశ్నిస్తూ దాని నిజ స్వరూపాన్ని దునుమాడుతూ కొనసాగుతుంది మూల కథ .

అయినా మధ్య మధ్యలో మేక-క్షురల హాస్యం, సుత్తి వేలు తాగుబోతు నటన తో ఆసాంతం హాయిగా కొనసాగుతుంది  ఈ కథ.  సినిమా నిడివి 2 గంటలే, కానీ 2 గంటల్లో వేసే ప్రశ్నలు చేసే విమర్శ అద్భుతం.

జంధ్యాల సినిమాల్లో ఎప్పటిలానే ఈ సినిమా కూడా వర్షం వెలిసాక తీసినట్టు  ఆహ్లాదకర గ్రామీణ వాతావరణం లో సాగుతుంది ఒక సీన్లో సుత్తి వేలు కల్లు  దుకాణం లో కల్లు  తాగుతుంటే అక్కడికి మేక గారు వస్తారు అక్కడ కల్లు  గుడిసె బయట నిలబడి సుత్తి వేలుని "నా కవిత విను "అని అడుగుతాడు అప్పుడు స్క్రీన్ చూస్తె నాకు భలే ఆనందంగా ఉంటుంది ఆ సీన్ లో నేల కాస్త బురదగా ఉండి దృశ్యం   అద్భుతంగా ఉంటుంది (వర్షం వెలిసిన తర్వాత ఉండే ఆ కొద్ది క్షణాలు కళ్ళముందు ఉంటాయి!).
సినిమా చివరి అంకం లో పూర్ణిమ పాత్ర చనిపోవడం అనేది ఆనాటి ఆలోచనా విధానాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ చేసినట్లుగా అనిపించింది నాకు !.

ఇప్పటికీ సమాజం మారలేదు వితంతువులకు పెళ్లి మాట ఏమో గానీ మామూలు గౌరవం దక్కడం కూడా కష్టం అయింది.  అనుమానపు చూపులు, పక్కకొచ్చి దారుణంగా మాట్లాడటం సాధారణం .

పరుగు

ఆశ, అవకాశం మనల్ని వెంటాడుతాయి
 మనం అవాకాశం వెంట పరిగేడతాం.

ఈ చక్రం లో ఇరుక్కునే.....  అంతా ఒకరికొకరు దూరం అవుతున్నారు.
కానీ ఈ పరుగులేవి లేని బాల్యం .....

ఆహా .... భుజానికి పుస్తకాల సంచీ వేసుకుని అలా పొద్దున్నే  వెళ్లి,
సాయంత్రం  దాకా కాలానికి నడక నేర్పి,
ఇంటికొస్తే ఉంటుంది హాయి....
అప్పుడు నేర్పిన నడక ఇప్పుడు పరుగు అయింది
..... కానీ ఆ హాయి రెట్టింపవ్వక పోగా అడుగంటుకు పోయింది! మ్ప్చ్ .     

Thursday, 28 February 2013

పంచభూతాల స్కాములు

1. బొగ్గు నుండి అగ్ని వస్తుంది----- కోల్గేట్ స్కాము .

2. ఆకాశం లో ఉన్న S -బ్యాండ్ కనిపించదు కానీ పని చేస్తుంది
       అలాగే 2G స్పెక్ట్రం ఆకాశం లో ఉంటుంది కానీ  కనిపించదు.

3. గాలి--- ఎన్నో ఫ్యాక్టరీ లనుండి ఫిల్టరు చేయని చెడు కాలుష్య వాయువులు ఎన్నో విడుదల అవుతున్నా                  పట్టించుకోని పర్యావరణ మంత్రిత్వ శాఖా -అధికారులు -మంత్రులు.


4. నీరు  కాస్త ఈ సెక్షను మాత్రం అలా మిగిలిపోయింది కానీ లోపల ఎన్ని జరుగుతున్నాయో ఎందుకంటే గంగా నది నాశనం అయిపోతుంటే చోద్యం చూస్తున్నారు ... కాలుష్య కారకాలని ఫ్యాక్టరీలు విచ్చల విడిగా వదులుతుంటే ఏమి చర్యలు తీసుకోవటం లేదు అంటే ఎంత మింగారో !.(రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలలో ఎంత స్కాము ఉందొ ఇంకోసారి అధికారం లోకి వస్తే దీని పని పడతారు ఖచ్చితంగా!)


5. భూమి మైనింగు భూతం ..... భకాసురుల్లా భూమిని మింగే మంత్రులకి కొదువలేదు .... (పాపం భకాసురుడు భూమిని మింగలేదనుకుంటా,  కానీ అంతా  పోలుస్తున్నారని పోల్చేసా సారీ భకాసురా!)ఇక సెజ్ పేరుమీద భాగస్వామ్యాలు ... ఆహా ఆ రియల్ దందా  చెప్పనవాసరం లేదు!


ఇవ్విదంగా మన కాంగీ లు  గత 10 సంవత్సరాలలో పంచభూతాలని చెరపట్టి విలయతాండవం చేసినా దేశం లో చాలా మంది కళ్ళు ఇంకా తెర్చుకొలెదంటే ఎంత బానిసత్వమో ఈ రక్తపు చుక్కలో ......
బానిసత్వం ఎందుకన్నానంటే 65 సంవత్స్తరాలలో 50 ఏళ్ళు కాంగీ పాలన అంటే ప్రజాస్వామ్యం లో అనధికారిక రాజ్య పాలన. అయినా ఏక -పార్టీ వ్యవస్థ కి ఇంతగా దాసోహం అన్న జనానికి స్వాతంత్ర్యం-స్వపరిపాలన  అవసరమా ......?

ఇది గమనిచే స్వామీ వివేకానంద గారు ఏనాడు స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన లేదనుకుంటా ఒక పుస్తకం లో చదివా స్వామీ వివేకానందులవారు అంటారు "భావ దాస్యం లో  నిండిపోయిన భారత జాతికి కావాల్సింది స్వపరిపాలన కాదు స్వాభిమానం -నేను ఉన్నతుడను అనే ఆత్మ జ్ఞానం" అని ... ఆ బుక్ ఈ సారి ఇంటికేల్లినప్పుడు తీసుకుని ఖచ్చితంగా ఇక్కడ పోస్ట్ చేస్తా!.
అందుకేనేమో మన దేశ యువతని ఉద్దేశించి "లే మేలుకో నీవు సింహానివి లక్ష్యం చేరేవరకు నిదురించకు" అని సింహానివి -సింహానివి అని తెగ అరిచాడు కానీ ఎం చేస్తాం ఆ బ్రిటీషు వాడు అంతా  గోర్రె లని  చేసి వెళ్ళాక కూడా ఈ గొర్రెలు తమ జన్యువులలో గోర్రేతనాన్ని మాత్రమే  నింపుకున్నారు  సింహాన్ని అన్న సత్యాన్ని మరిచారు! .

వెయ్  రాజా వెయ్  ఓటెయ్యి, నీ జన్మకి ఇంకోసారి కాంగీ కి వోటేసే అవకాశం వస్తుందో లేదో వెయ్.... జన్మకో శివరాత్రి అన్నారు నీ జన్మ కో కాంగీ  వోటు వేసి తరించి ఆ మిగిలిన నీటి స్కాము కూడా నింపించు  దగ్గరుండి.

కానీ నా డౌటంతా ఈ పంచ భూతాల మీదనే ఎందుకంటే 2004 లో సునామీ వచ్చి చిన్న పలకరింపు చేసి వెల్లిది వీరి రాకను చూసి పులకరించి!, మరి  వీరి పాలన నచ్చి మిగతా భూతాలూ ఊరుకుంటాయా? మీరు మాతో ఆడారు సరే మరి మేము మీతో ఆడుటాము అంటే మేమంతా కదా చచ్చేది ... ఓహో వారి మింగుడుకు ఓటు  ద్వారా పర్మీషను-అధికారము  ఇచ్చింది మేమే కనుక మేమే అనుభావవించాలా  సరే ..... ఏం చేస్తాం  చావక చస్తామా !!!.

ఇప్పటికే వీరికి అధికారం ఇచ్చి ముంబాయి,పూణే , హైదరాబాదుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సరస సల్లా పాలకు  అనుభవిస్తున్నాం కదా మరి ఈ ప్రకృతి  వైపరిత్యాలు బోనస్సేమో !

విండోస్ 8

మొట్టమొదటిసారి ఈ రోజు విండోస్ 8 వాడాను ... డెల్  లాప్టాప్ లో (కోనేంత  లేదండి ఆఫీస్ లో!)...ఇక్కడ  చూడగానే ఒక విషయం గమనించా  అదేంటంటే విండోస్ 8 లో స్టార్ట్ లోగో ఉండదు అక్కడ ఖాళీగా ఉంచాడు అంటే స్టార్ట్ లోగో ఉండేచోట ఖాళీగా ఉంది (చిదంబరం లో అదృశ్య లింగం లా...!) ఇలా చేసాడేంటి  అని ఆలోచిస్తే తట్టింది ఇంతకుముందు  విండోస్ వాడిచ్చిన స్టార్ట్ లోగో ని గూగుల్ వాడు కాపీ కొట్టాడు కదా  అందుకే  ఈ సారి ఏం  కాపీ కొడతావో ,ఎలా కాపీ కొడతావో చూస్తా అన్నట్లు ఖాళీ గా ఉంచాడు!
నాకైతే అది గమనించగానే సిల్లీ గా "భగవంతుడు నిర్గుణ-నిరామయ-నిరాకారుడు" కనుక ఖాళీ ఉంచాడు  స్టార్ట్ లోగో లేని  విండోస్ సిస్టం .....స్టార్ట్  లేదంటూనే అక్కడ మౌస్ ని ఉంచగానే వెంటనే తన మెనూ చూపించి నేనున్నానోచ్ !అంటుంది!హ హ హ ...... ఇప్పుడు గూగుల్ వాడు ఇక కాపీ కొట్టలేడని అనుకున్నాడు మైక్రోసాఫ్ట్ వాడు కానీ ఖచ్చితంగా ఏదోటి కాపీ కొట్టి ముందుకొస్తాడు అని నా ఊహ!


అయినా స్టిక్కీ  నోట్ లో కాపీ చేసిన కంటెంట్ పేస్టు చేసి ctrl +s  కొట్టే నా ఎదవ మైండ్ కి ఇలాంటి తింగరి ఆలోచనలు పరిశీలనలు కాక మంచివోస్తాయా! ఏమో?

Monday, 25 February 2013

ముఖపుస్తకం

ముఖపుస్తకం లో చూసా...   ఊరిలో ఏదైనా కార్యక్రమం ఉంటే గ్రామపంచాయతి వారు డప్పు చాటింపు వేసి  తెలియ పరిచేవారు దానికి బదులుగా  మైక్ వాడుతున్నారట ఇప్పుడు ఆ ప్ఫోతో ఒకటి పెడితే చూసి ఒక కామెంట్ పెత్త...గ్రామ వాతావరణం దూరమైపోతుంది,దప్పె బాగుండేది అని దానికి నా అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది వారి అభిప్రాయాలు కామెంటారు ...కానీ నేను వాటికి అంగీకారం తెల్పలేకపోతున్నాను,అక్కడ రాస్తే తెగ ఇది అయిపోయి పర్సనల్ జీవితం లో ముఖపుస్తక  మాటలని సీరియస్ గా తీసుకుని నాకు నెగటివ్ అవతారాని ఇక్కడ వెల్లకక్కుతున్నాను ..ఽసలు చాతిమ్పుకు మైక్ ఏంటి అది చెప్పడానికి మళ్ళీ ఒక బైకు.... ఇంతకుముందు ఇద్దఋ విడి విడిగా వేరు వేరు వీదులల్లో దప్పుతో చాటింపు వేసే వారు కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే బైకు మీద ఒకేసారి మైక్ తో చాటింపు వేస్తున్నారు ఇది కొంచె అతి అనిపించింది వారు చెప్తున్నా కారణాలు కాదనలేము ఇప్పటి వయసు వారు డప్పు కొట్టుటకు వీలు లేకుండా అయింది (సిద్ధంగా లేరు),ముసలి వాళ్లకి గొంతు పెద్దగా రావటం లెదు.... సరె...బాగానె ఉంది మార్పు సహజమే-అభివృద్ధి రావాల్సిందే కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే "టం టం టం....... ఇందు మూలంగా తెలియచేయునది ఏమనగా మన వూరి గ్రామ పంచాయతీలో చీన్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారహో...... మీ ఇంట్లో ఉన్న 5ఏళ్ల లోపు పిల్లలకి తప్పకుండా వేయించాలని సర్పంచ్ గారి ఆజ్ఞ .... టమకు టం టం .....  "ఇలాంటి మాచి ట్యూన్ పోతుంది ..... ఆ డప్పు వాయించే "కళ" అంతరిస్తుంది ... అందుకే నాకు నచ్చాలే. 

ఒకరి మాట విని కాం ప్ర మైస్ అయ్యే రకం కాదు నేను, అయినా ఓ ..... పొలోమని  వచ్చి పడ్డాయి కామెంట్లు ..... (నా అభిప్రాయం తప్పు అని నొక్కి వక్కనిస్తూ ) నాకు అర్థం అయింది ఏమంటే నేను ముఖపుస్తాకానికి కొత్త ...... ఇలాంటివి సహజం ...అని, అంతే కాదు  నేను ఒకపట్టాన ఒప్పుకోనని, సో ఈ బ్లాగు వన్-వే లాంటిది కనుక నాకు నచ్చింది టపా అవుతుంది లేకుంటే టపా కడుతుంది ఒకరు చెప్పరు ...ఈ బ్లాగు చూడరు, కనుక హాయిగా మన అభిప్రాయాలు మనవే అంతే......
అక్కటా అని మాత్రం అనుకున్నా ...  వీరి చేత చెప్పించుకుంటినేమయ్యా  అని మాత్రం అనుకున్నా ఎందుకంటే వూళ్ళో ఉండగా మనం వారిని కన్సిడర్ చేసింది లేదు బాగా తెలిసింది లేదు ...ఏదొ ఈ మధ్య ఊరికి దూరంగా ఉన్నాం కదా ఊరి పేరుమీద నడుస్తున్న ముఖపుస్తక గ్రూప్ అని చేరితిని-చేరితిని పో ఏల కామెంట వలే -కామెంటి తిని పో ఎలా వ్యతిరేక అభిప్రాయం వేల్లడాయే- అయ్యెను పో ...నెనెల చింతించవలె .....హ..... 

నాకు ఉన్న ఒకే ఒక ఆశ ...ఒక పల్లెటూరిలో సెటిల్ అవ్వాలి అని నా కల కలలో కూడా తీరవద్దు అని మన ప్రభుత్వం పల్లెటూర్లని నాశనం  చేస్తూ వాటికి నగరాలు- కాలనీలు అని పట్నం రంగు పులుముతూ కాలుష్యం కోరల్లోకి నెడుతున్నారు ,మా గ్రామం వెళుతుంటే 3కి మీ ముందు ఒక చిన్న జామాయిలు చెట్ల అడవి మొదలయ్యి రెండువైపులా ఒక అడవి ఫీల్ తెప్పిస్తుంది. ఇప్పుడది పల్చపడిపోయింది ఇలాంటి కొండ మార్పులు వస్తే ఆ కాస్త ఇష్టం కూడా పోయి ఎక్కడో ఒక చోటికి వెళ్ళింది బెటర్ అనిపించేలా ఉంది అది నా భయం!

Friday, 22 February 2013

భయం

భయం...... భయం ఇదీ ఉగ్రవాదులు మన దేశ ప్రజలకి ఇవ్వలనుకునేది భయపెట్టాలి ఆ వికటాట్ట హాసాల మధ్య మనం భయం తో పరుగులు తీయాలి ...  మన ఆక్రందనలు నొప్పితో చేసే ఏడుపులు...  మరణించిన మనుషుల ఆత్మలు చేసే  ఘోష  ఏమాత్రం జాలిని కలిగించదా ?గాయాల తో నెత్తురోడుతూ సాగించే జీవన ప్రయాణం ఎంతవరకు...... ఎందుకోసం  ఈ పాపపు పని పాపాత్ములు చేస్తుంటే వారికి శిక్షలు వేయొద్దు శిక్షల్ని నిషేదించాలి అని రోడ్డెక్కె నేతలు ఎక్కడ?.... జరగాల్సిన నష్టం జరిగి కుటుంబాలు కూలిపోయినప్పుడు కలిగే బాధ ని కంట నీరుని చూసినప్పుడైనా అనిపించదా ఈ నీచులకి ఇంత  ఘోరాలకి పాల్పడిన వారు శిక్షార్హులే అని?

జనం ముందుకు ఇప్పుడొకసారి వచ్చి అనగలడా ఆ నొప్పిని పంచుకోగాలడా?బతకాలని ఆశ తో(కోటి ఆశలకి తావు లేదిక్కడ!) నగరానికి వచ్చికోచింగ్ తీస్కుంటూ భవిష్యత్తు కోసం తపిస్తున్న ప్రాణం గాలిలో కలిసింది ..ఆ భవిష్యత్తుకు చెప్పగలడా అఫ్జల్ గురు ని ఉరి తీయొద్దని?ఈ నీచ నికృష్ట ఉగ్రవాదులు రేపు దొరికితే వారికి కూడా శిక్ష ఉరి కావాలి ..... మరి అప్పుడు కూడా బ్యానర్లు పట్టుకుని రోడ్దేక్కుతారా ఈ నీచులు.

వర-వర రావు....  ఇప్పుడు ఎందుకు  మూగ బోయింది నీ  గొంతు .... అరువు అరువు.....  ఉద్యమం అని ఏంతో  మంది ప్రాణాలు బాలికోన్న నీకు ఈ ప్రాణాలు ఒక లెక్క కాదు కానీ ఆ కుటుంబాలకి అండ -నీడ భవిష్యత్తుకి మిగిలిన ఆశ మరి ఆ జీవితాల విలువ నీకు తెలుసా ఉగ్రవాదులు కనిపిస్తే కౌగిలించుకొని "నీ తప్పేమీ లేదు నీవైపు నేనున్నా అని భరోసా ఇస్తావా ఏంటి ?". నీలాంటి వాడు కూడా ప్రజాస్వామ్యం లో మానవతావాది అని పిలవబడుతున్నాడే అదీ నా దేశ రాజ్యాంగ గొప్పతనం నీ భాష లో చెప్పాలంటే ...రాజ్యాంగానికొ సలాం అది లాల్  అవ్వచ్చు కాలే అవ్వచ్చు!.

ఇది ఖచ్చితంగా ఉరితీతకి ప్రతీకార చర్యనే అనవచ్చు వారె అఫ్జల్ తమవాడు అని ప్రకటన విడుదల చేసినా నీవు అంగీకరిస్తావా ...... జనాల మధ్య నించొని ఉగ్రవాడికి జై కొట్టి ..... ఉపన్యాసాలిచ్చే నీలాంటి వారు ఉన్నంత వరకు ఉగ్రవాదులకోచ్చిన కష్టం ఏమి లేదు అది తెలిసే వారు రెచ్చిపోతారు.


Wednesday, 20 February 2013

చిరంజీవికి రాజకీయం బాగానే ఒంటబట్టింది

రాజకీయం .....చిరంజీవికి రాజకీయం బాగానే ఒంటబట్టింది ఎందుకంటే తను పొందిన పదవి పర్యాటక శాఖ అంటే మనదేశానికి -విదేశాలకి మధ్య రాకపోకల కు కాస్తవరకు సంబందించిన రాచ కార్యం!.

సో తన వంతుగా సినీ పరిశ్రమకి కాస్త "చేదోడు-వాదోడుగా"   ఉందామని అనుకుని ఒప్పుకున్నట్లున్నాడు (తీసుకున్నాడేమో !).
అసలే పర్మిషన్ల కోసం బాగా తిరిగి ఎక్కే-మెట్టు దిగే-మెట్టు  కనుక పర్యాటకం బాగానే ఉంటుంది బావా అని అరవింద్ చెబితే ఉ ...... అనేశాడేమొ .
అసలు ఈయన రాష్ట్ర కాంగ్రేసుకి పెద్దగా చేసింది పైకి కనబడుటలేదు(లోగుట్టు-పెరుమాళ్ళకెరుక)అయినా  పిలిచి పార్టీలో స్థానం ఇచ్చి- రాజ్యసభ లో  సీటిచ్చి- పదవిచ్చి -నెత్తిన పెట్టుకుంది కాంగిరేసు.  మరి ఆనాడు అంతా  వై.ఎస్ పథకాలవల్లే  కాంగిరేసు గెలిచింది-అన్నారు ప్ర. రా.పా కూడా ఒక కారణం అని భావించి ఇంత  పని చేసిందా!?!. ఏదేమైనా చిరు మంచి అవిడియా వేసి జనాన్ని(సారి నమ్మకాన్ని ) అమ్మాడు అనేది వాస్తవం.

ఈ మధ్య వార్తల్లో చదివా మన తెలుగు సినిమా షూటింగు వాళ్ళు  యూరపు...  అందులోనూ స్పెయిన్ లో కలియ తిరుగుతున్నారని బాగానే పంపుతున్నరనుకుంటా!.

సరేలే ఠాగూర్ డవిలాగులు బాగా పండి వోట్లిచ్చాయి సినిమా ఆడింది కదా అని తనూ ఆడితే ఇదిగో ఇలానే ఉంటుంది జనం ఈసడించుకున్నా- కాంగీ మాత్రం వదలలేదు అంటే చంద్రబాబు ని ఎదుర్కోవడానికి కాంగీ ికి  దొరికిన "బినామి" అన్నమాట!.
జరా బద్రంగా ఉండి  ఈసారైనా మేల్కోక పొతే కొత్త కొత్త పేర్లు పెట్టేసి కుంభ కోణాలు  చేసి పార దొబ్బుతారు ఈ కాంగీ నాయాళ్ళు! నా సంపాదనని ట్యాక్స్ రూపం  లో తీసుకుని  ఇటలీకి తరలిస్తారు ఇలాంటి బినామి నాయకులు ఓట్ల ని ఇస్తారు.

నిజంగా రాజకీయం మాత్రం బాగా అబ్బింది. కాని తెలుగు వాణ్ని మళ్ళీ మదరాసి గుంపులో కలిపి పారేశాడు హిందీ లో మాట్లాడడం రాక!, త్వరలో నేర్చుకుంటా అని ఒ....పెద్ద మైకు ముందు అనేసి మదరాసి టచింగ్ ఇచ్చాడు!


Tuesday, 19 February 2013

ఎన్నికల పండగ

ఎన్నికల పండగ .... ఎలాచ్చన్న్లు ఒస్తున్నాయహొ....!

అవునండి ఈ గ్రామపంచాయతి ఎన్నికలు అంటే మహా ప్రాధాన్యం ఎందుకంటే ఓటు హక్కు ఉన్న ప్రతోడూ తాగి తందానాలాడొచ్చని.

నిజం ...నిజ్జంగా నిజం 15ఏళ్ల పైబడ్డ వారికి ఈ కాలం లో మందు మహా  తేలికగా- తెరగా దొరుకుతుంది పైగా ఈ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్టు గదా ఇక పండగే అన్నమాట!.

నా గతానుభం ద్వారా ఇక్కడ చెప్పగలుగుతున్నాను(అంటే నేను బానిసనని కాదు నా ఫ్రెండ్స్ కొందరు ఇలాంటి సందర్భం లో చెడిపోయారు అలా!) ...కొత్తగా తాగుడు మొదలెట్టే కాలమిది, చాలామంది ఈ కాలం లోనే  మొదటిసారి మందు  ముడుతారు ఇక చూస్కో ఇప్పుడు మొదలెడితే సుమారు చచ్చే దాకా వదలరు ఇప్పుడు పడే బీజం మహత్తరమైనది మరి!!.

కాస్త సీరియస్ గా  రాస్తను....
నిజంగా ఎవరైనా సర్వ్యే  చేస్తే నిప్పులాంటి నిజాలు తెలుస్తాయి ఈ నిప్పులు  అడవిని కాల్చేవి కాదు కొంపలు కాల్చేవి ఇప్పుడు తేరగా వస్తుంది కదా అని అలవాటు లేని వాళ్లు కూడా తాగటం మొదలుపెడతారు,తర్వాత బానిసలై జీవితాలని నాశనం చేసుకుంటారు .ఈ పాపం అన్ని పార్టీ లది.

చిన్న చిన్న గ్రామాల్లో యువత తాగుడు మొదలెట్టే కాలం ఈ ఎన్నికల ప్రచారం తో ప్రారంభమౌతుందిం. అన్ని పార్టీల  లోకల్ నాయకులు వారి బావుల కాడ  -పొలాల వద్ద రాత్రి పూట రంజుగా ఈ "వైతరణీ నదిని పారిశ్తారు!!@!".

ఎవరూ దీన్ని ఆపలేరు ఎందుకంటే ఎన్నికల సంఘం కనుక ఎవరినైనా నియమిస్తే  వాడు అన్ని పార్టీల వద్ద ఇంత  తీస్కుని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అంతే .....  మిగతాది ఎప్పటిలానే.

మరి ఆపటం ఎలా..... హి హే  హె .... చెప్పటం కష్టం .
మీ కింద ఎవరైనా 15 ఎల్లా పైబడి ఇంకా మందేయటం నేర్వలేదంటే వారిని కాస్త 45 దినాలు కట్టడి చేస్తే చాలు.


లేదు మనమే మాచి ఎమ్.ఎస్ లము అయితే ఇంకేముంది నా రాజ కుమ్మిక ఎత్తే సీసకి దించే సీస కీ టైం గ్యాపు ఇవ్వకుండా .... పంచె నేతకి తాతలు గుర్తొచ్చేలా తాగింది ఎక్కడాని -దిగడాని కి కూడా కన్ఫ్యూస్ అయ్యేలా కుమ్మొదులు  అంతే !!!. 

Friday, 15 February 2013

ఒక వితండం

ఒక వితండం....బాగా చదివి మాంచి జ్ఞానం సంపాదించిన తలలు అన్ని ప్రైవేటు రంగం లో స్తిరపడితే  మరి ప్రభుత్వ రంగం లో  ఉండే వాళ్ళంతా నాసిరకంగా జ్ఞానులైనప్పుడు మాంచి సేవలు ఎలా దొరుకుతాయి?
బయట చాలా ఉదాహరణలు దొరుకుతాయి .......మంచిగా చదివి చేతికి  గవర్నమెంటు ఉద్యోగం వచ్చినా జ్ఞాన-సముపార్జన ఆగిపోతుందనే కారణంగా ప్రైవేటు ఉద్యోగానికే వెళ్ళేవాళ్ళు చాలామందే ఉంటారు!.
ఐ.ఐ.టి లలో చదివిన వాళ్ళు ఎంతమంది ప్రభుత్వరంగం లోకి వస్తున్నారు?
సరే ఐ.ఐ.టీ  ల కె తెలివుందా  మిగతా వారికి లేదా అంటే మరి కంపెనీలన్నీ ఐ.ఐ.టీ ల  నుండి వచ్చిన వారికి పెద్ద మొత్తాల్లో జీతాలు ఎందుకిస్తాయి ?.
మరి ప్రభుత్వ రంగంలో వారు ప్రైవేటు రంగం వారితో సమానంగా ఎదగాలంటే అడ్డదారులు తోక్కక తప్పటం లేదు అనే స్తాయికోచ్చే బదులు జీతాలు పెంచి జ్ఞానవంతులకె ఉద్యోగాలివ్వ వచ్చు గదా!అప్పుడు ఈ స్కాముల గొడవ ఉండదు.

 కానీ మన జనం  కూడా  అవినీతికి బాగా అలవాటు పడ్డారు-అందుకే అడ్డదారుల్లో పని కావాలని ప్రయత్నిస్తారు అందుకేనేమో మనకి ఇలాంటి నేతలున్నారు.

 ఇదేనేమో "యదా రాజా తథా ప్రజా "అంటే!.

Wednesday, 13 February 2013

దాస్యం

పరిగెడితే దొరికేది స్వేచ్చ కాదు భయం......నీకు స్వేచ్చ  స్వాతంత్ర్యాలు కావాలంటే నిలబడు, ఎదురుతిరుగు , ప్రశ్నించు ముందున్నది ఏదైనా ఎదుర్కో .

మన భారత దేశ ప్రజలు ఇప్పటికీ భావ దాస్యం తో ఉన్నారు, నా జీవితం లో .....ఆంగ్లేయులే కాస్త నయం మన దేశం విడిచి ప్రపంచం లో ఎక్కడో ఒక మూల బతికింది మేలు అని అనే వాళ్ళు ఎదురు పడుతున్నారు(ఈ మధ్య ఎందుకంటే.... ఈ మధ్యన్నే నేను బయటి ప్రపంచం తో కలిసాను అదేనండి చదువైపోయి సమాజం లో పడ్డాను !) .

వారందరికీ నే చెప్పేది పై మొదటి వాక్యమే!!!
అసలు మన రక్తం లో ఇంకా భయం పిరికితనం పోలేదు,ఎందుకంటే ఒక సారి ఊహించుకోండి మిమ్మల్ని ఒక చీకటి కొట్టం లో బందించి కంటికి ఏమికనిపించని విధంగా చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది అలాంటి దరిద్రం లో మిమ్మల్ని పొట్టు  పొట్టు  కొడితే ఎంత భయానకంగా ఉంటుంది!!.మరి మనపూర్వీకులు అలాంటి బాధలేన్నో ఓర్చుకుంటే గాని మనకి స్వాతంత్ర్యం దొరకలేదు మరి వారు అనుభవించిన భయం తాలూకు లక్షణాలు ఇంకా మన లో ఇంకా పోలేదు అందుకే ఇలా ఆలోచిస్తారు వదిలేల్లి పొతే ఎంతబాగుటుండు .....ఎగిరిపోతే ఎంత బాగుంటుంది !!!!అని కాని బయటి దేశం లో వెళ్లి బ్రతికితే ప్రశాంతత దొరుకుతుంది కాని సార్థకత దొరకదు,(సర్లే నీకొస్తే నీవేల్లవా అంటారేమో వెళ్తా కాని పారిపోవాలని కాదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి!).చాలా మంది ఈ దేశం లో ఉంది నల్లదనం  పెంచడానికి శిస్తు కట్టేబదులు విదేశాల్లో సెటిల్ అయితే బెటర్ అనేలా తయారయ్యారు!.

మరి ఇది పారిపోవడమే కదా....దాస్యమే కదా!.జలియన్ వాలా భాగ్ ఉదంతం లో ప్రాణాలు పోతూ ఉంటే  ఒక మనిషిలో కలిగే భయాలు తరతరాలు అలా కొనసాగుతున్నాయేమో! అరె మనల్ని కొట్టే ప్రతివాడు గోప్పోడయిపోతాడు వాడికి చెక్క భజన గాళ్ళు పుట్టుకొస్తారు!

మరో విషయం అసలు ఈనాడు అఫ్జల్ గురు ని ఉరి తీస్తే అరిచేవాళ్ళు ఒక బులెట్ గాయం చేసే నొప్పి తెలుసా?
అయినా వీళ్ళు బాద   తో అరుస్తున్నట్లు లేదు భయం తో అరుస్తున్నట్లుంది.

ఔరంగ జెబ్ ..కత్తి  తో మతాన్ని మార్చాడని చరిత్ర ఘాట్టి గా అరుస్తుంటే..ఒకసారి విని అసలేం జరిగిందో తెలుసు కోవడానికి ప్రయత్నిస్తే .....తల తెగిన మొండేలని  చూపించి కుటుంబ సభ్యులతో మతం మార్పించారు, అవయవాలు కోసి బెదిరించి మతం మార్చారు,మరి అలాంటప్పుడు  కలిగిన భయం ఇంకా నేటి తరాల లో పోలేదనుకుంటా అందుకే లేని పోనీ సానుభూతి చూపిస్తారు ఆ దాస్యం నుండి విడలేదు కనుకే ఇప్పటికీ పరమతాలు గొప్ప ని వాగుతారు గొప్ప అంటే  పర్వాలేదు కాని నా దేశ సంస్కృతి ఇచ్చిన  పురుశ సూక్తం మీద పడి  ఏడిస్తే కాలిపోతోన్దిక్కడ ఇలాంటి కుక్కలా నాలుకలు తెగ్గొయాఅలనిపిస్తున్ది!.వీడి  పూర్వీకుడు పరమ పిరికి పంద  అయ్యి మతం మారి నేడు దేశ సంస్కృతీ ,ధర్మం మీద పడి  విచ్చలవిడిగా బతికేస్తున్నాడు ఆ తెగిన తలల నొప్పి వీడికి తెలిస్తే వీడిలా మాట్లాడుతాడా?

Sunday, 10 February 2013

మోసం

మోసం ....67 ఎళ్ళ నుండి చేస్తున్నా మారరు ఈ అమాయకులు ఇన్నేళ్ళ నుండి మేమే సెక్యులర్ మేమే సెక్యులర్ అంటూ మోసం చేస్తూంటే ఆ చేతి లో నలిగి పోతూ ఇప్పటికీ కనీస వసతులు  లేకున్నా.... ఇవ్వకున్నా అదే చేతిని నమ్మి "మేము హిందువుల కంటే అన్ని విషయాలలో వేరు కాని కాంగీ ని నమ్మి చేతిలో నాశనం కావడం లో వారితో సమానమే అని నిరూపిస్తున్నారు మన మైనారిటీ సోదరులు ".

 ఆ అఫ్జల్ దరిద్రున్ని ఉరి తీస్తే ఎర్రలు ధర్నా అని ఎగురుతున్నారట   న్యూస్ లో చూసా ఎందుకో తెలియదా .....వైఎస్ పుణ్యాన చచ్చిన ఎర్ర(ర్రి ) తనాన్ని మైనారిటీ ఓట్ల తో బతికిద్దామని కక్కుర్తి!.

అయినా అఫ్జల్ గాన్ని నెత్తికి ఎత్తుకుంటే ఓట్లేసే  విశ్వాస హీనులు రేపు పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే మన సైనికులదే తప్పు అంటారు గాని పాకిస్తాంది తప్పు అనరు అక్కడ చచ్చే భారతీయ  సైనికులని చూడరు కాని పాకిస్తాన్ సైనికున్ని జాలిగా చూస్తారు ఇక ........ మన అక్బర్ భాయి ..'నో'రెత్తుతాడు !!!.

అసలు ఆ పార్లమెంటు పై దాడి కార్గిల్ విజయం పై కక్ష తో చేసింది కాదా!ఇక్కడ లోపాలు కాదు చూడాల్సింది మళ్ళీ అలాంటిది చేయాలంటే భయం కలగడానికి ఘాట్టి జవాబివ్వాలి ఈ వరవర రావు గానిదేం   పోయింది చచ్చేది మన సెక్యురిటీ కోసం ప్రాణాలిచ్చే వారిది కదా!, ఆ కుటుంబాల  ముందు  ఈ ధర్నా చేస్తే తెలిసేది వాడికి  ఆ బాధ!
హ్యుమన్ రైట్స్ -తొక్క - తోలు అనే వాళ్ళు ఇక సైనికులు బార్డర్ లో ఉండనవసరం లేదని చెప్తారేమో ఎందుకంటే చావు ఎవరికైనా  చావే కదా వీరికి .....ఒక్క ఉగ్రవాది ఇలాంటి  వాణ్ని చంపితే తెలుస్తుంది ఆ చావు నొప్పి.
ఎదవలని ఎందుకు కాపాడుతున్నామా అని సైనికులు అనుకునేలా ఉన్నాయి ఈ ఓటు బ్యాంకు రాజకీయనాయకుల చేష్టలు.

ఉరి ఆన్ని విష యాలలో ఒకటి అనలేము వాడు పార్లమెంటు పై దాడి చేసాడు, రేప్  కి ఉరి కావాలి అందులో న్యాయం ఉంది - దేశం పై దాడి కి అవసరం లేదా? అలాంటప్పుడు ఈ దేశానికి సైన్యం ఎందుకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని వదిలేయవచ్చుకదా!   ఈడికి- ఈడి  పెళ్ళాం పిల్లలకి బాద  కలిగితే "చంపండి నా  యాల్లని" అని అనడా?  అయినా తప్పుకి తగిన శిక్ష లేకుంటే ఎందుకండీ ఇక చట్టం?.


ఎవడు కాపాడుతాడో ఈ దేశాన్ని...... నన్ను!

ఓపికుంటే వెళ్లి చూడండి వీడి ఆకృత్యాలని
"http://www.youtube.com/watch?feature=player_embedded&v=bZYm57XeYqU"

Wednesday, 6 February 2013

ఫోనులో ప్రేమ

ఫోనులోనే ప్రతిపాదనలు - ఫోనులోనే అమ్మా నాన్న లతో మాట్లాడడం ...ఫోనులోనే నిర్ణయాలు - ఫోనులోనే నిరాకరణ అన్నీ ఫోనులోనే ఏం  ప్రేమరా బాబు!........అవునండి నా కాళ్ళ ముందే కొద్ది రోజులుగా జరిగిన ప్రేమ వ్యవహారం అంతా  ఫోనులోనే మరీ పరాచికాలైపోయాయి ఈ రోజుల్లో పాపం ఆ అమ్మా నాన్న ఎంత కుమిలి పోయారో!ఎంత ఆలోచించారో! సడెన్ గా ఫోను చేసి ఇదీ సంగతి అని చెపితే ఎంత ఊహించుకుంటారు వీడికి ఆ సెన్స్ లేక అంతా  ఫోనులోనే.......... నాకైతే దిమ్మ తిరిగి పోయింది ఈ ఫోను వ్యవహారం చూసి......నా బాదేంటంటే?..నేను సలహాలివ్వాల్సిన గత్యంతరం రావడం!కాని నావరకు బానే నెగెటివ్ సలహాలిచ్చా!మరంతేగా ఈ ఫోను ప్రేమకి ప్రోత్సాహం అవసరమం?ఇది  నా అభిప్రాయం! సరే లెండి  వివరంగా తర్వాత రాస్తా గాని ఇప్పటికింతే.:-)

Saturday, 2 February 2013

జంధ్యాల

జంధ్యాల గారి హై  హై  నాయక  సినిమా మళ్ళీ ఓ సారి  చూసా ....ఆహా ఎం సినిమా అండీ మొత్తం సినిమా.....వర్షం వెలిసాక  తీసినట్టు ఉంది ఎంత బాగుంటుందో,అసలు ఈ సినిమా ని వర్షా కాలం లో చూస్తె ఇంకా బాగా ఉంటుంది.
మహానుభావుడు ఎంత మంచి సినిమాలు తీసాడు,అసలు ఈ సినిమా చూస్తూంటే భలే ఉంటుంది ఆ తెలుగు మాష్టారి కష్టాలు, బామ్మ చాదస్తం, ఆ పాటలు భలే గా ఉంటాయి ఆ లోకేషన్లు ఎక్కడివో గానీ కేక,పచ్చగా గడ్డి ,మచి పల్లె వాతావరణం.

ఇది సరిగమలెరుగని ........భాషే లేని భావము పాట ,  అచ్చులు పదహారు న వయసల్లె హల్లులు 32 పాట  ఇవ్వన్ని ఒక ఎత్తు.... గురువంటే గుండ్రాయి కాదు..పాట మస్తుగా ఉంటుంది.

ఒక్కొక్కరి నటన చాలా బాగుంది నరేష్ ఆక్టింగ్ సూపర్,ఆ బుడ్డోడి వేషం వేసింది ఎవరో గాని కెవ్వు అసలు,రాదా రాణి - మాష్టారి ప్రేమ- వారి మధ్య వచ్చే సన్నివేశాలు భలే నవ్వు తెప్పిస్తాయి!
అసలు నాకు మనసేం  బాగాలేనప్పుడు  ఈ సినిమా చూస్తే ..ఎంత రిలాక్సింగా ఉంటుందో!ఆ సినిమా నాకు బాగా నచ్చిన సినిమాల్లో ముందుంటుంది.
జంధ్యాల గారికి పే..............ద్ద  అభిమానిని అంటే వయసులో కాదండి!చాల ఇష్టం అని నా భావం,ఆయన సినిమాలు సుమారు 15 చూసుంటా(దర్శకత్వం చేసినవి ) అవన్నీ నాదగ్గర ఉన్నాయి కాని బాధ కలిగించే విషయం ఏంటంటే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని అందుబాటులో లేవు అసలు వాటి లిస్టు పూర్తిగా ఎక్కడా దొరకదు వికీపీడియా  లో  ఉన్న సినిమాలల్లో కొన్ని మాత్రమె అందుబాటులో  ఉన్నాయి .

ఎం రాసినా తక్కువే .......ఎం రాయాలో తెలియడం లేదు ఇదెలా ఉందంటే ప్రేమలేఖ రాస్తున్నప్పుడుండేంత కఫ్యుశన్ గా ఉంది,పోలిక తప్పయినా భావం మాత్రం అదే అంత  ఇష్టం ఆయన సినిమాలు రచన,కనుక ఈ టపా ముగిస్తున్నాను.

Thursday, 31 January 2013

కులం

చాతుర్-వర్ణ విధానం లో శూద్రులను తక్కువ చూపారు అని తెగ విమర్శిస్తారు చాలా మంది.
మనుస్మృతి లో విష్ణువు భుజాల నుండి క్షత్రీయులు,తల నుండి బ్రాహ్మణులు తొడలనుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు పుట్టారు అంటారు కదా...ఇందులో తప్పేముంది?అసలు మన దేశాన్ని విడదీయాలని పొరుగు దేశస్తులు  ఈ విధానం లో తక్కువలు ఎక్కువలు శృష్టించారు ,ఇందులో ఎక్కువ తక్కువ అనుకోవడానికి  లేదు, ఎందుకంటే
" మనం గుడికి వెళ్తే దేవుడి తల పట్టుకుని మొక్కం భుజాలు తడిమి మొక్కం పాదాలు తాకుతాం దేవుణ్ణి మొక్కడం అంటే వంగి-పాదాలు తాకడం" అంటే ఇక్కడ శూద్రున్ని మొక్కుతున్నాం గాని క్షత్రీయున్ని కాదే ?.
మరి చిల్లరగా ఈ తెడాలేంటి.

అసలు రిజర్వేషన్లు ఇచ్చింది అభివృద్దికి గాని మన దేశ  జనాభాని మన సంస్కృతిని చంపుకోవడానికి కాదే!మరి ఈ కులాలకి "కొలతలిచ్చి" వాటిని ఓట్ల సమూహం గా  చూడడం ఎందుకు?.

తప్పు రిజర్వేశాన్లది కాదు- మతానిది కాదు ......................మనిషి ఆశది.

ఈ ఆశ అనేది ఎంత దరిద్రపు గొట్టు పనులనైనా చేయిస్తుంది అందుకే  మన వేదాలు ఎప్పుడు ఘోషిస్తాయి నీలోనికి చూడు నిన్ను గుర్తించు అప్పుడు ఈ ఆశల నుండి  దూరంగా దైవం వైపు నీ ప్రయాణం మొదలౌతుంది అని వింటామా లేదు నాకు ఇది కావాలి అదికావాలి   పిచ్చి పరుగులు  తీస్తాం! 

కులం అనేది జన్మతః వస్తుంది  అది నీకు  ఒక కళ ని కూడా  ఇస్తుంది మీరు ఒకసారి గమనించినట్లయితే... ప్రతి కులం లో ఒక కళ ఉంటుంది .....కుమ్మరి ,కమ్మరి,మంగలి (విదేశాల్లో కేశాలంకారణ కి మాంచి డిమాండ్ ఉంటుంది ) ఒక కళాకారుడు  తన తండ్రి ద్వారా తాత ద్వారా కళని పొందుతాడు తరతరాలు గా కళలో జీవనాధారం వెతుక్కుని జీవిస్తారు!

"వేరే మతాలల్లో కులాలు లేవు అనేది గొప్ప విషయం కాదు" ...అది వారి దూరదృష్టి  లోపం అరె ఇంత  గొప్పగా జీవనాధారం ఇచ్చే ఈ కులం - కులవృత్తి కాన్సెప్ట్ కి కూడా మన వాళ్ళు వక్ర భాష్యాలు ఇచ్చి దుర్వినియోగం చేసుకుంటా రేమిటో  అర్థం కాదు!.

మంగలి వాడు ప్రపంచంలో ఏ దేశం లోనైనా   కులవృత్తి చేసుకుని బ్రతకగలడు   అలాగే కమ్మరి, చెప్పులు కుట్టేవాడు ...ఇలా ఎవరైనా  ఆర్ధిక మాంద్యం  తో పని  లేకుండా హాయిగా బతక గలరు!.

"కులవృత్తి మరవకురా గువ్వల చెన్నా!" 

ఇదొక మాంచి నానుడి కాని మనిషి కులవృత్తి లొ లేని లోపాలని వెతికి చిన్న చూపుతో  వాటికి దూరం అయ్యి సంఖనాకి పోతున్నాడు మాంచి కళ గల కమ్మరులు లేక నేడు ఏంతో  మంది ఇష్టం లేకున్నా రెడీ మెడ్ నగల తో అడ్జస్ట్ అవుతున్నారు.

విదేశాలలో ఈ ప్రత్యామ్నాయ విధానం లేక ఎవడు ఎం చేస్తాడో తెలియక ప్రతి పదేళ్లకోసారి ఆర్ధిక మాంద్యానికి కారకులవుతున్నారు! అంతే  గాని మన దగ్గర ఉన్నట్లు వీడు దీనికి బాగా పనికొస్తాడు అని ,వీడికి ఈ పనిలో ప్రావీణ్యం ఉంది అని లేదు.
అంటే  మన పూర్వీకులు మన కులం లో ఒక కళ ని ఇన్-స్టాల్  చేశారు అన్నమాట!.  

అసలు మనిషి ని తక్కువ చూడ్డం  అనే కాన్సెప్ట్ మంచిది కాదు , దానికి కులం అనేది కొలతకాదు, కలిమి-లేమి అనే వాటి కారణంగా ప్రతీ మతం లో ప్రతీ దేశంలో ఉండేవే అంత  మాటకి వస్తే మన హిందుత్వం లో కులం ద్వారా కళ- కళా కారులని గౌరవించాలి అనే మాట ద్వారా ప్రతి మనిషి గౌరవిన్చాబడుతాడు దానికి కలిమి లేములు బేస్ కాదు.
ఉదా:మన పూర్వీకులు "మాంచి పనితనం ఉన్నోడు " అని తక్కువ కులస్తులకి కూడా మర్యాద ఇచ్చి న సంఘటనలు చాలా ఉంటాయి. ఈ పని తనం ఎక్కడినుండి వస్తుంది కులం నుండే గదా!.
నేటి తిక్క భారతీయుడు అనుకున్నట్టు గా కులరహిత సమాజం ఒక కళని మనిషికి ఇవ్వలేక పోయింది,డబ్బు ఉంటె మర్యాద లేకుంటే లేదు అనే స్థితి వచ్చింది. అదే డబ్బు లేకున్నా పనితనం ఉన్న వాడు అని మర్యాదగా చూస్తున్నారా  పనితనం ఉన్నావానికి మర్యాద దొరక్కపోతే వాడు పనిచేయడని వాడి తో కాస్త మర్యాదగానే వ్యవహరిస్తారు.
ఇక ఆస్తులు ఎదుగుదల...అంటే చేసే పనిని ఎంత విభిన్నంగా చేస్తావు అనే దాని తో నీ ఎదుగుదల ఉంటుంది ఉదా:నిక్ షూ  ల కంపనీ ఒక శూద్రుడు (చెప్పులు కుట్టే వాడు) పెట్టి ఎదిగితే బాగానే ఉంటుంది కదా నీ ప్రోడక్ట్ ని నువ్వు ఎలా ప్రమోట్ చేస్తావు అనేది నీ తెలివి తేటలని బట్టి ఉంటుంది కాని కులం అడ్డుకోదు  గదా!.


ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఈ కులాల కంపు ఎన్నికల ముందే లేస్తుంది మళ్ళీ 5 ఎళ్ళ వరకు బాగానే ఉంటుంది మరో 10-11 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అంటే ..కులం కంపు లేవ్వనుంది!!!!!!!.

Wednesday, 30 January 2013

బ్రతుకు

ఆత్మహత్య చేసుకునే ధైర్యం లో సగం బతకటానికి ఉంటే  జీవితానికి చుక్కలు చూపించొచ్చు!------->క్లాస్ గా ఉండే డైలాగ్.
చచ్చేంత ధైర్యం ఉంటే .... దాంట్లో సగం బతకటానికి చూపించు.....జీవితానికి ఉచ్చ పోయించవచ్చు!----->మాస్ డైలాగ్.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే చచ్చెంత, ధైర్యము లేక బ్రతికేంత పట్టుదల లేక....నలిగి పోతూ ఉండే కన్నా బాగా ఆలోచించి ఫుల్లో - హాఫో ధైర్యం అరువు తెచ్చుకోవటం మేలు!...ఎక్కడంటార? ఏమో వెతకండి వెతికితే దొరుకుతుంది కదా ఈ లోకం లో!!!

Tuesday, 29 January 2013

మనిషి

మనిషిని మనిషి గా చూసేదెందరో! ఎందుకంటే సినీ తారాలకి అందరు మనుషులు అబిమానులుగా,ఫాల్లోవర్లు  గా ,ఈ మధ్య భక్తులుగా కనిపిస్తారు,క్ రికెటర్లకు అంతా - అభిమానులుగా వారి బ్రాండ్లు కొనే వినియోగదారులుగా కనిపిస్తారు!.
రాజకీయనాయకులకి ఓటర్లుగా కనిపిస్తారు కొందరు నాయకులకి (నారయణ దత్  తివారి లాంటి వారికన్నమాట....ఈయన చాలా ఎన్నికలలో కాంగిరేసును ఒంటి చేత్తో గెలిపించారు మరి!!!!)బానిసలుగా కూడా కనిపిస్తారు!.
ఇహ వ్యాపారస్తులకి కేవలం వినియోగాదారులుగానే కనిపిస్తారు అందుకే కొనక చస్తావా?అంటూ విదేశీ బ్రాండ్ల ని తెగ దింపుతున్నారు!
ఇలా అందరికి మనుషులు అవసరం లానో ,డబ్బు లానో కనిపిస్తారు-చూస్తారు తప్ప మనిషిని మనిషిగా చూసేదేప్పుడు?ఈ మద్య రీసోర్స్ గా కూడా చూస్తున్నార్ట! ఏంటో లోకం అర్థం కావటం లేదు!!!!!.

Friday, 25 January 2013

సంస్కృతి

ఆస్తులివ్వలేదని అమ్మ-నాన్నలని ,మార్కులివ్వలేదని ఉపాద్యాయులను ...మారుస్తూ పొతే సంఖనాకిపోతావ్ రేయ్ ....
బ్రతకటానికి జీవితాన్ని ఇచ్చి , స్వేచ్చని ఇచ్చిన స్వధర్మాన్ని వదిలి పరధర్మం పంచన చేరే ఎదవళ్ళారా...ఆశ కి అంతులేదని, అవసరాలవెంట పరిగెత్తితే దొరికేది అలసట మాత్రమె నని గ్రహించండి ......!!
బాధలు కష్టాలు ఎదురవ్వని ప్రాణం ఉండదు వాటిని ఎదుర్కోవడం ఒక్కటే మార్గం అలా  కాదని టాయిలెట్ క్లీనర్లని నమ్మి మీరు పాపులు, మీరు నీచులు అంటే నమ్మితే.....అలానే అయిపోతారు ! మనకు పుట్టుకతో వచ్చిన మన సంస్కృతి ని పాటిస్తే అది ఉత్తమమైన మార్గం.
కనుక మతం మారి పోతె అన్ని పోతాయి అంటే .....పోతాయి  నీవి అనదగ్గ నీ అస్తిత్త్వాలు పోతాయి కాని దరిద్రాలు కాదు.నీ ఇతిహాస ధర్మాలు పరిశీలిస్తే దొరికే సమాధానాలతో ఎన్ని  సమస్యలనైనా ఎదుర్కోగలవు...తెలుసుకోతెలుసుకుని మసలుకో!!!!

గమనిక:ఇక్కడ స్వధర్మం అన్నాను...అనగా పుట్టుకతో,జన్మస్థలం తో లభించేది గాని నేను ఎక్కడా హిందుత్వం అని వాడలేదు!!!.అనగా "be a rome-in-rome"అన్న మాట.

సంస్కృతి

నాది అనుకున్న సంస్కృతి నశిస్తోంది అని ఎవరో అంటుటే కలవరపడ్డాను కాని నాకుఎదురుగా వస్తున్నా పీర్ల పండగని చూసి మురిసిపోయా ఎందుకంటే నాది అని అనాదిగా గుహల్లొఅ చిత్రీకరించుకుని, గుళ్ళు కట్టి ఆరాదించిన  విగ్రహారాధన ఇంకా పోలేదని,పైగా అది పరమతం లో  ఇమిడిపోయి విలసిల్లుతోంది అని!

అరె.... బానిసత్వం తో పాటుగా అంటించిన పాపులమనే తత్త్వం - మూడత్వం కలవరపెడుతోంటే అప్పుడే అంతా కలిసి చేసుకుంటున్న ఆరోగ్యమాత  ఉత్సవాలు చూసి మళ్ళీ నాదే గెలిచినిది అనుకున్నా...సేవ పేరులో చేసిన మోసం ఎన్నో ఏళ్ళు దాగదని తన అస్తిత్వాన్ని కాపాడుకోవటం  నా సంస్కృతికి బాగా తెలుసనీ అందుకే ఇన్నెళ్ళైనా అలా  నెగ్గుకొస్తూనే  ఉంది అని ఇప్పుడే తెలుసుకున్నా!.

అసలు ఎవరన్నారండి ఈ దేశం లో సంస్కృతి  కి ఆపద వచ్చింది అని,జిజియా పన్ను పేరు తో రక్తాన్ని ధనరూపం లో తాగిన శతాబ్దాల రాచరిక దాస్యం నుండి విముక్తిని పొంది సూర్యుడస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం  తో పోరాడి చివరికి స్వాతంత్ర్యం సాదించి సగర్వంగా నిలిచిన భూమి ఇది!
పోరాడి పోరాడి పోరాటం నాలో నిండింది కనుక ఈ అవినీతి నల్ల జీవులు ఆ తెల్ల(ఇటలీ ) జీవులతో కలిసి  చేసే అరాచాకాలని కూడా పోరాటం తోనే కడిగేస్తాం...కాని ఈ పోరాటం వోటు తో చేసేది ..!

"అసలు దొంగలెవరు  దోచుకోలేనిది విద్య" అనేది సత్యం అయితే లార్డ్ మెకాలే గారు విశ్వా ప్రయత్నం చేసినా మన రక్తం నుండి తొలగిపోనిది జ్ఞానమే కదా..అదే జ్ఞానం తో ప్రపంచాన్ని నడుపుతున్నాం ....శాంతి ని సహనాన్ని చేతకానితనం అనుకుంటే అది అనుకునే వాని పొరబాటు కాని మంది కాదు కదా...!

మీరు పాపులు,పాపపు మరకలు మేం  క్లీన్ చేస్తాం అంటూ వచ్చే టాయిలెట్ క్లీనర్లకి సమాధానం ఇస్తూ తర తరానికి ఒక జ్ఞాన జ్యోతి ఈ గడ్డ మీద నిరంతరం వెలుగుతూనే ఉంది.ఒక రామకృష్ణ పరమ హంస, స్వామీ వివేకానంద ,ఒక రవి శంకర్ ,ఒక జిడ్డు కృష్ణ మూర్తి ....ఒక రమణ మహర్షి ...నేటికీ చాలా మంది తత్వ విజ్ఞాన జ్యోతులను వెలిగిస్తూనే ఉన్నారు,శాస్త్ర విజ్ఞానం లో తిరుగు లేని విదంగా రాణించే విద్యా కుసుమాలు విరబూస్తూనే ఉన్నాయి!అవార్డు లే జ్ఞానానికి ప్రమాణం అనుకుంటే పొరబాటే అవుతుంది ఎందు కంటే ఉత్తర కొరియా లో పని చేసే శాస్త్రవేత్తలకి అమెరికా అవార్డులివ్వడు  కదా!అలానే మన వ్యవస్థ కూడా.

కాని మన రక్తం లో 1000 ఏళ్ళు గా నింపిన దాస్యాన్ని కడాగాల్సిన అవసరం ఉంది నీవు సింహానివి...జగద్గురువు అయిన భారతీయ జ్ఞాన జ్యోతివి బానిసవు కాదు.అని  చైతన్యాన్ని   దీపాన్ని దేశం  నలుమూలలా ప్రకాశింపచేయవలసిన ఆవసరం ఉంది. 
ఏంటో పచ్చకామెర్ల వాడికి అంటా పచ్చగా నెఅ కనబడుతుంది అన్నట్లు నా కు అంటా బాగానే కనబడుతోంది అంతా  హిందూస్తాన్ లో హిందుత్వమే కనపడుతోంది ..ఎవరు  మతం తెచ్చినా అది   "HINDIVAISATION "(అదేనండి! INDIANAISATION ).

చివరాకర్ణ..................... "హిందువుగా జీవించు హిందువునని గర్వించు."