Friday, 15 February 2013

ఒక వితండం

ఒక వితండం....బాగా చదివి మాంచి జ్ఞానం సంపాదించిన తలలు అన్ని ప్రైవేటు రంగం లో స్తిరపడితే  మరి ప్రభుత్వ రంగం లో  ఉండే వాళ్ళంతా నాసిరకంగా జ్ఞానులైనప్పుడు మాంచి సేవలు ఎలా దొరుకుతాయి?
బయట చాలా ఉదాహరణలు దొరుకుతాయి .......మంచిగా చదివి చేతికి  గవర్నమెంటు ఉద్యోగం వచ్చినా జ్ఞాన-సముపార్జన ఆగిపోతుందనే కారణంగా ప్రైవేటు ఉద్యోగానికే వెళ్ళేవాళ్ళు చాలామందే ఉంటారు!.
ఐ.ఐ.టి లలో చదివిన వాళ్ళు ఎంతమంది ప్రభుత్వరంగం లోకి వస్తున్నారు?
సరే ఐ.ఐ.టీ  ల కె తెలివుందా  మిగతా వారికి లేదా అంటే మరి కంపెనీలన్నీ ఐ.ఐ.టీ ల  నుండి వచ్చిన వారికి పెద్ద మొత్తాల్లో జీతాలు ఎందుకిస్తాయి ?.
మరి ప్రభుత్వ రంగంలో వారు ప్రైవేటు రంగం వారితో సమానంగా ఎదగాలంటే అడ్డదారులు తోక్కక తప్పటం లేదు అనే స్తాయికోచ్చే బదులు జీతాలు పెంచి జ్ఞానవంతులకె ఉద్యోగాలివ్వ వచ్చు గదా!అప్పుడు ఈ స్కాముల గొడవ ఉండదు.

 కానీ మన జనం  కూడా  అవినీతికి బాగా అలవాటు పడ్డారు-అందుకే అడ్డదారుల్లో పని కావాలని ప్రయత్నిస్తారు అందుకేనేమో మనకి ఇలాంటి నేతలున్నారు.

 ఇదేనేమో "యదా రాజా తథా ప్రజా "అంటే!.

No comments:

Post a Comment